Tollywood: అలాంటి పాత్రలు చేయాలని ఉందంటున్న ముద్దుగుమ్మ!

భవిష్యత్ లో ఎలాంటి రోల్స్ చేయాలని ఉందని అడగగా... ప్రిన్సెస్ లా నటించాలని ఉందని కృతి శెట్టి తెలిపింది. అలాగే ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ కూడా చేయాలనీ ఉందని కృతి పేర్కొంది.

New Update
Tollywood: అలాంటి పాత్రలు చేయాలని ఉందంటున్న ముద్దుగుమ్మ!

Tollywood: టాలీవుడ్‌ డైనమిక్‌ నటుడు శర్వానంద్‌ నటిస్తున్నలేటెస్ట్‌ చిత్రం మనమే...టాలెంటెడ్‌ డైరెక్టర్‌ శ్రీరామ్‌ ఆదిత్య రూపొందిస్తున్న ఈ మూవీలో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో 35 వ సినిమాగా రూపుదిద్దుకుంటుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 7 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్,టీజర్ ,సాంగ్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న హీరోయిన్ కృతి శెట్టి ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది. ఈ సినిమాలో తాను సుభద్ర అనే పాత్ర చేస్తున్నట్లు ఆమె వివరించింది.ఇప్పటివరకు నేను క్యూట్ అండ్ బబ్లీ రోల్స్ చేశాను.అయితే ఈ సినిమాలో నేను చాలా స్ట్రిక్ట్ రోల్ చేశాను. ఈ సినిమాలో శర్వానంద్ ఎంతో అద్భుతంగా నటించారు.

ప్రతి సీన్ కూడా ఆయన సూపర్‌గా చేసారు.ఈ సినిమాలో శర్వానంద్ గారి పెర్ఫార్మెన్స్ ని మ్యాచ్ చేయడం చాలా కష్టం.అయితే ఈ సినిమాలో ఆయనతో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపింది. అయితే భవిష్యత్ లో ఎలాంటి రోల్స్ చేయాలని ఉందని అడగగా... ప్రిన్సెస్ లా నటించాలని ఉందని కృతి తెలిపింది. అలాగే ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ కూడా చేయాలనీ ఉందని కృతి పేర్కొంది.

Also read: కన్యాకుమారి పేరు వెనుక ఉన్న కథేంటి..అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా!

Advertisment
తాజా కథనాలు