సన్నకారు రైతులకష్టాలు తీర్చిన టీడీపీ నాయకుడు వెనిగండ్ల రాము

కృష్ణాజిల్లా గుడివాడలో టీడీపీ నాయకుడు వెనిగండ్ల రాము పర్యటించారు. గుడ్లవల్లేరు మండలంలో పలు గ్రామాల్లోని రైతులు టీడీపీ నాయకుడు వెనిగండ్ల రాము పరామర్శించారు. అంతేకాకుండా 6 గ్రామాల పరిధిలోని 12 వందల ఎకరాల రైతులకు అవసరమైన మొండి కాలువ పూడికతీత పనులు ప్రారంభించారు.

New Update
సన్నకారు రైతులకష్టాలు తీర్చిన టీడీపీ నాయకుడు వెనిగండ్ల రాము

Krishna District Venigandla Ramu the leader of TDP who solved the problems of small farmers

వైసీపీప్రభుత్వ నిర్లక్ష్యంతో దక్షిణ భారతదేశ ధాన్యాగారమైన కృష్ణాజిల్లా రైతులకు అవస్థలు పడుతున్నారని వెనిగండ్ల రాము వ్యాఖ్యనించారు. జగన్‌ ప్రభుత్వ అసమర్ధతతో వనరులు ఉన్నా... రైతులకు ఉపయోగపడటం లేదని ఆయన మండిపడ్డారు. నియోజకవర్గంలో కాలువల పూడిక తీతకు వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా ఉచితంగా ప్రోక్లైన్ ఏర్పాటు చేసిన ఆయన అధికార ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా జగన్‌ సన్న కారు రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా రైతులకు అవసరమైనన్ని రోజులు ఉచితంగా ప్రోక్లైన్ సమకూరుస్తాం ఆయన తెలిపారు. అడిగిన వెంటనే సహకరించిన రాముకు పొలిమెట్ల, కుచికాయలపూడి, నుజెళ్ళ అంగులూరు, సిరిచింతల గ్రామాల రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పాలని గుడివాడ టీడీపీ నేత వెనిగండ్ల రాము ప్రశ్నించారు. నియోజకవర్గంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కనుమరుగయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేని పరిస్థితిని కల్పించారని, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించడం వల్ల ప్రజల్లో సహనం నశించి పోతోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు పనికి వచ్చేలా ఓ ఒక్క పని ఉందని ఎవరూ అనుకోవట్లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు