Kotam Reddy: దమ్ముంటే ఇలా పోటీ చేయండి.. విజయసాయిరెడ్డికి కోటంరెడ్డి సవాల్..!

అధికార పార్టీకి చెందిన వారు ఉచ్చ నీచాలు మరిచి విమర్శలు చేస్తున్నారన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సోషల్ మీడియాలో కోట్లు ఖర్చు పెట్టి మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. విజయసాయి రెడ్డికి గెలుస్తాననే నమ్మకం ఉంటే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు.

AP: వైసీపీ నాయకుల్లారా కళ్ళు ఉంటే ఇలా చూడండి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి సెన్షేషనల్ కామెంట్స్..!
New Update

Kotam Reddy:నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పై ఘాటైన విమర్శలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీకి చెందిన వారు ఉచ్చ నీచాలు మరిచి విమర్శలు చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో కోట్లు ఖర్చు పెట్టి వ్యక్తి గత విమర్శలు చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. కొన్ని యూ ట్యూబ్ చానెల్స్ ను కొనుగోలు చేసి దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కూడా యూట్యూబ్ ఛానల్ కొనుగోలు చేసిన BRS పార్టీ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసన్నారు.

సొంత చెల్లెల్లనే వదలడం లేదు..

సొంత చెల్లెలు, సొంత చిన్నాన్న కూతురుపైనే సోషల్ మీడియా వేదిక ఎలాంటి ప్రచారాలు చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. కోవూరు నియోజకవర్గం ఎమ్మల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పై కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన విమర్శలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. వరుసకు ప్రసన్నకుమార్ రెడ్డికి ప్రశాంత్ రెడ్డి చెల్లెలు అవుతుందన్నారు. నెలరోజుల క్రితం ప్రసన్నకుమార్ రెడ్డి ప్రత్యేక యాగం ఏర్పాటు చేసి ఆదిదంపతులు అంటూ వేమిరెడ్డి దంపతులను పొగిడారని గుర్తు చేశారు. టీడీపీ తరఫున వేమిరెడ్డి దంపతులను పోటీ చేయడం నేరమా? నెలరోజుల క్రితం మంచివారు అని చెప్పిన మీరు ఈ రోజు ఒక చెడ్డవారైపోయారా? అని ప్రశ్నించారు.

Also Read: నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు.. కారణం ఇదే..!

చరిత్ర తెలుసుకోండి..

నల్లపు రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఓటమి భయం తోనే ప్రసన్న కుమార్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని కామెంట్స్ చేశారు. వేమిరెడ్డిని వ్యక్తిగతంగా దూషించిన ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన చరిత్ర తెలుసుకోని మాట్లాడాలన్నారు. ఉన్నత చదువులు చదువుకొని వ్యాపారాలు చేసి సంపాదించిన డబ్బుతో త్రాగునీరు, వైద్యం, విద్య ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.

మర్చిపోయారా?..

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తెలియకుండానే వైసీపీలో అభ్యర్థులు మారుస్తున్నారన్నారు. అభ్యర్థులను ఎందుకు జిల్లాలు దాటిస్తున్నారో వారికే తెలియాలని కామెంట్స్ చేశారు. వేమిరెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచాడంటున్నారు మరి ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశం,కాంగ్రెస్, వైసీపీ ఇలా ఎన్నిసార్లు ఎన్ని పార్టీలు మార్చారో మర్చిపోయారా? అని నిలదీశారు. జిల్లాలో హుందాతనం రాజకీయాలు చేయాలని సూచించారు.

రాజీనామా చేసి పోటీకి వెళ్లండి..

విజయ సాయిరెడ్డి రెడ్డి గురించి మాట్లాడుతూ.. నెల్లూరు వైసీపీ పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి పదేపదే ఇన్ని లక్షల ఓట్లు మెజార్టీతో గెలవబోతున్నామని చెప్తున్నారని.. అయితే వారిని  రాజ్యసభ పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. విజయసాయి రెడ్డికి గెలుస్తానే నమ్మకం ఉంటే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. విజయ సాయిరెడ్డి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారం లోకి రాదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా మెలుగుతున్నారు..

#kotamreddy-sridhar-reddy #mp-vijaya-saireddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe