ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఎన్నికల్ దగ్గర పడే కొద్ది అసంతృప్తి నేతలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీలో నోటీసులు కలకలం రేపుతున్నాయి. కన్నా లక్ష్మీ నారాయణ ఇన్ చార్జ్ గా బాధ్యతలు చేపట్టాక.. పార్టీ కార్యక్రమాల్లో కోడెల శివరామ్ ఆయన వర్గీయులు యాక్టీవ్ గా లేరని, దీనికి కారణాలు చెప్పాలంటూ మంగళవారం 16 మందికి హై కమాండ్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులతో కోడెల శివరామ్ వర్గీయలులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నిన్నమొన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న సత్తెనపల్లి టీడీపీలో ఇప్పుడు ఈ నోటీసులు అగ్గిని రాజేశాయి. తాజాగా ఈ నోటీసులపై రియాక్ట్ అయిన కోడెల శివరామ్.. టీడీపీ అధిష్టానానికి కౌంటర్లు వేశారు.
పూర్తిగా చదవండి..టీడీపీకి చురకలంటించిన కోడెల శివరామ్.. కారణం అదేనా?
దశాబ్దాలుగా పార్టీ అభివృద్ధికి కష్టపడిన వాళ్లకు నోటీసులివ్వడం ఏంటని కోడెల శివరామ్ ప్రశ్నించారు. చిలకలూరి పేట, నర్సారావు పేట, గురజాలలో చాలా మంది టికెట్స్ ఆశిస్తున్నారు. వాళ్లంతా నారా లోకేష్ ఎదుటే కొట్టుకున్నారు కూడా.. అలాంటి వారికి నోటీసులు ఇవ్వకుండా.. తనకు ఇవ్వడమేంటని ఫైర్ అయ్యారు. తెలుగు దేశం ఆఫీస్ ప్రారంభించినప్పటి నుంచి కన్నా లక్ష్మీ నారాయణ ఒక్కసారి కూడా అందులోకి వెళ్లనే లేదు. ఆయనకు నోటీసులివ్వకుండా..
Translate this News: