AIIMS, SBI, BDL FCI, Mannu, హైదరాబాద్ యూనివర్సిటీలతో కలిపి మొత్తం12 శాఖల్లోని వివిధ విభాగాల్లో 238 మంది అభ్యర్థులకు కిషన్రెడ్డి అపాయింట్మెంట్ లెటర్స్ అందించారు. నేడు జరిగిన 9వ రోజ్గార్ మేళాతో కలుపుకుని మొత్తం ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 6 లక్షలకుపైగా యువత ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు అపాయింట్మెంట్ లెటర్స్ పొందారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న రోజ్గార్ మేళాలో భాగంగా ఇవాళ అపాయింట్మెంట్ లెటర్లు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. తెలిపారు. మీ తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను నరేంద్ర మోదీ ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేస్తోందన్నారు. భారతదేశం ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా అవతరించింది. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ భారతదేశంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధికి దోహదపడుతోందన్నారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: 6 లక్షల మందికి మోదీ సర్కార్ జాబ్స్.. మరి కేసీఆర్ ప్రభుత్వం సంగతేంటి?: కిషన్ రెడ్డి
భారతీయ విద్యాభవన్, కులపతి మున్షీ సదన్లో జరిగిన 9వ "రోజ్ గార్ మేళా" కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలను ఆయన బషీరాబాగ్, కింగ్కోటిలోఅందజేశారు.
Translate this News: