Krupa Rani: అతడు నయ వంచనకు నిలువెత్తు నిదర్శనం: కృపారాణి

నయ వంచనకు నిలువెత్తు నిదర్శనం జగన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి. మోడీకి తొత్తులుగా పొత్తు పార్టీలు, వైసీపీ వ్యవహారిస్తున్నాయని ఆరోపించారు. వైఎస్ ఆశయ సాధనకు షర్మిల రాక ఎంతో దోహద పడుతుందన్నారు.

Krupa Rani: అతడు నయ వంచనకు నిలువెత్తు నిదర్శనం: కృపారాణి
New Update

Killi Krupa Rani : మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి RTV తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్(CM Jagan) పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రవర్తనకు ఏం పేరు పెట్టాలి తెలియదన్నారు. నయ వంచనకు నిలువెత్తు నిదర్శనం జగన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన ద్రోహిగా కాంగ్రెస్ పార్టీ(Congress Party) ని చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: వైఎస్ చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే? సంచలన విషయాలు బయటపెట్టిన సునీత!

వైఎస్ ఆశయ సాధనకు షర్మిల(YS Sharmila) రాక ఎంతో దోహద పడుతుందని పేర్కొన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చే రోజులు దగ్గర్లోనే వున్నాయని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే మోడీకి తొత్తులుగా పొత్తు పార్టీలు, వైసీపీ వ్యవహారిస్తున్నాయని మండిపడ్డారు. పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఎంపీ సిట్లు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు.

#killi-krupa-rani #cm-jagan #congress
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe