దాని వలనే సిద్దార్థ్‌ కి పడిపోయా..కియారా!

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కియారా అద్వాణీ తాజాగా కాఫీ విత్‌ కరణ్ షోలో పాల్గొన్నారు. అందులో ఆమె తన భర్త సిద్దార్థ్ మల్హోత్రా తనకి ప్రేమ ప్రపోజ్ చేసిన విషయం గురించి అభిమానులతో పంచుకుంది.

దాని వలనే సిద్దార్థ్‌ కి పడిపోయా..కియారా!
New Update

ఈ ఏడాది ఇటు టాలీవుడ్‌ తో పాటు బాలీవుడ్‌ లో కూడా చాలా మంది నటులు పెళ్లి పీటలు ఎక్కారు. వారిలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కియారా అద్వాణీ కూడా ఉన్నారు. ఆమె తన స్నేహితుడు సిద్దార్థ్‌ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు మొదట షేర్షా చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు.

ఈ నేపథ్యంలోనే కియారా '' కాఫీ విత్‌ కరణ్‌'' షోలో పాల్గొన్న కియారా తన పర్సనల్‌ లైఫ్‌ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా కియారా తన భర్త సిద్దార్ధ్‌ తనకు ప్రేమ గురించి తెలిపిన క్షణాలను గుర్తు చేసుకుంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ..'' సిద్దార్థ్‌ తో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి అందరం ఓ సారి రోమ్‌ కు ట్రిప్‌ వెళ్లాను.

అక్కడ ఓ రోజు క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ చేసిన తర్వాత రోమ్‌ వీధుల్లో సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాం. అప్పుడు ఓ వ్యక్తి మా దగ్గరకు వచ్చి వయోలిన్‌ ప్లే చేస్తూ పాట వినిపించాడు. ఆ సమయంలో సిద్దార్థ్‌ మోకాళ్ల పై కూర్చొని ''షేర్షా'' సినిమాలోని ''ఢిల్లీ కా సీదా సాదా లుండా హు'' అనే డైలాగ్‌ చెప్పి తన ప్రేమ విషయం గురించి చెప్పి ప్రపోజ్‌ చేశాడు.

అంతే ఆ క్షణం ఏదో తెలియని ఆనందంలో వెంటనే ప్రేమకు అంగీకారం తెలియజేశాను. మా ఫ్రెండ్‌ ఒకరు ఈ సంఘటనను వీడియో తీసి నాకు బహుమతిగా ఇచ్చారు. నా జీవితంలో చిరకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకమది’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది.

Also read: కేసీఆర్ హెల్త్‌ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు!

#love-proposal #coffee-with-karan-show #siddarth-malhotra #kiyara-adwani
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe