టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ (Rekha Naik) మంత్రి కేటీఆర్ పై (Minister KTR) సంచలన వాఖ్యలు చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధికి కేటీఆర్ అడ్డుపడ్డారంటూ ధ్వజమెత్తారు. ఎస్టీ నియోజకవర్గం అభివృద్ధి చెందకుండా స్థానిక మంత్రి కూడా అడ్డుపడ్డారని ఆరోపించారు. చివరకు నా అల్లుడిని కూడా వేధించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలతో నా అల్లుడికి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం చెప్పినట్లు బానిసలా పని చేశానన్నారు.
ఇది కూడా చదవండి: Raja Singh: రూ.500 కోట్లు ఖర్చు చేసినా నేనే గెలుస్తా: సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత రాజాసింగ్ సంచలన ఇంటర్వ్యూ
ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు రేఖా నాయక్. లేకుంటే తన స్టైల్లో స్పందించాల్సి వస్తుందని తీవ్ర వాఖ్యలు చేశారు. అవకాశం ఇస్తే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. లేకుంటే కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తానన్నారు. తాను భయపడి బతికే రకం కాదన్నారు. ఖానాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ ఎలా గెలుస్తారో చూస్తానని సవాల్ విసిరారు. ఆమె ఇంకా ఏమన్నారో ఈ కింది ఇంటర్వ్యూలో చూడండి.