Khairatabad Maha Ganapathi: హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 70 ఏళ్ళ నుంచి వినాయకుడి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ ఏడాదీ ఒక్కో అడుగూ పెంచుకుంటూ..ఈ సారి 70 అడుగుల మహాణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు నిర్వాహకులు. ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి జనాలు లక్షల్లో వస్తారు. ప్రతీరోజూ ఇక్కడ క్యూల్లో జనాలు ఉంటూనే ఉంటారు. మొత్తం తొమ్మిది రోజుల పాటూ మహాగణపతిని ఉంచుతారు. ఈ లెక్క ప్రకారం రేపటితో గణేష్ నవరాత్రులు ముగియనున్నాయి. రేపే మొత్తం ట్విన్ సిటీస్లో ఉన్న వినాయకుళ్ళను నిమజ్జనం చేయనున్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని కూడా హుస్సేన్ సాగర్కు చేర్చనున్నారు. ఈ నేపథ్యంలో గణేశుడి ఆదాయాన్ని లెక్కించారు నిర్వాహులు.
పూర్తిగా చదవండి..Hyderabad: ఖైరతాబాద్ గణేశుడి ఆదాయం 70 లక్షలు
హైదరాబాద్లో ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ వినాయకుడిని రేపు నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా ఈరోజు మహాగణపతి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 70 లక్షలు ఆదాయం వచ్చిందని ప్రకటించారు.
Translate this News: