TS: గురుకుల లెక్చరర్స్ నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు!

తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్సరర్ల భర్తీకీ సంబంధించిన ఇష్యూలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నోటిఫికేషన్ వివాదం కొనసాగుతుండగానే అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇవ్వడాన్ని తప్పుపట్టింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టాలని గురుకుల బోర్డుకు సూచించింది.

New Update
TS: గురుకుల లెక్చరర్స్ నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు!

Gurukula: తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్సరర్ల భర్తీకీ సంబంధించిన ఇష్యూలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరాలు తెలుసుకుని చెప్పాలని స్టాండింగ్‌ కౌన్సిల్‌ను న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాదు అన్ని వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని సూచిస్తూ విచారణ వాయిదా వేసింది.

నివేదిక రాకముందే నియామకాలు..
ఈ మేరకు గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్‌ లెక్చరర్ల భర్తీకి గతేడాది ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే ఇందులో ఇచ్చిన రూల్స్ పాటించకుండా తమను పక్కకు పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్‌ పల్లికి చెందిన గంగాప్రసాద్‌తో పాటు మరో 9 మంది హైకోర్టులో పిటి షన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయ మూర్తి జస్టిస్‌ పుల్ల కార్తీ క్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున న్యా యవాది చిల్లా రమేశ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘జంతుశాస్త్రం, వృక్ష శాస్త్రం లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఎంఎస్సీలో ఏ సబ్జెక్ట్‌ చేసి నా డిగ్రీలో మాత్రం సంబంధిత సబ్జెక్ట్‌ చేసి ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీంతో డిగ్రీలో జంతుశాస్త్రం, వృక్ష శాస్త్రం చదివి.. ఎంఎస్సీలో మరో సబ్జెక్ట్‌ చదివిన పిటిషనర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పరీక్షల అనంతరం ప్రకటించిన మెరిట్‌ లిస్ట్‌లో పిటిషనర్ల పేర్లు కూడా ఉన్నాయి. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత పిటిషనర్ల అర్హతపై నిపుణుల కమిటీ వేశామని, నివేదిక వచ్చేదాకా ఆగాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి: TSPSC: హాస్టల్ వార్డెన్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ డేట్ వచ్చేసింది!

తుది తీర్పు తర్వాతే..
అయితే ఆ నివేదిక రాక ముందే పిటిషనర్లను పక్కకు పెట్టి ఇతరులకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇచ్చారు. ప్రభుత్వ తీరు సమర్థనీయం కాదు. మెరిట్‌ ప్రకారం పిటిషనర్లకు కూడా అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలిని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని గురుకుల నియామకాల బోర్డును ఆదేశించారు. స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు. మార్చి 5న జారీ చేసిన నోటిఫికేషన్‌ కింద జరిగే నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు