JC Prabhakar Reddy: హైదరాబాద్ నుంచి తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి.. పోలీసులు హై అలర్ట్..!

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ నుంచి తాడిపత్రికి వస్తున్నారని పోలీసులు హై అలర్ట్ అయ్యారు. జేసీని తాడిపత్రికి రానివ్వకుండా గుత్తి, అనంతపురం, నంద్యాల, కడప రహదారుల్లో చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాడిపత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

JC Prabhakar Reddy: హైదరాబాద్ నుంచి తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి.. పోలీసులు హై అలర్ట్..!
New Update

Also Read: ఈసీ స్పెషల్ ఫోకస్.. ఈ జిల్లాలో పెట్రోల్ బంకులపై ఆరోజు వరకు ఆంక్షలు.!

తాజాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ నుంచి తాడిపత్రికి వస్తున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. హైదరాబాద్‌ నుంచి నేరుగా జేసీ తాడిపత్రికి చేరుకోనున్నారని తెలిసింది. దీంతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. జేసీని తాడిపత్రికి రానివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాడిపత్రి పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read: తెలంగాణ కేబినెట్ భేటీ.. సర్కార్ కీలక నిర్ణయాలు ఇవేనా..!

గుత్తి, అనంతపురం, నంద్యాల, కడప  రహదారుల్లో చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాడిపత్రికి నాయకులు వస్తే మళ్లీ అల్లర్లు జరిగే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కౌంటింగ్‌కు కూడా రావొద్దని ఇప్పటికే ఇరుపార్టీల లీడర్లకు ఆదేశాలు జారీ చేశారు. అల్లర్లపై విమర్శల నేపథ్యంలో అధికారులు ఈ సారి హై అలర్ట్ అయ్యారు.

#kethireddy-pedda-reddy #jc-prabhakar-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe