Kesineni Swetha : ఎమ్మెల్యే గద్దెను కలిసిన కేశినేని శ్వేత

ఈ రోజు పార్టీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం అవుతున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత.. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు రాజకీయంగా సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Kesineni Swetha : ఎమ్మెల్యే గద్దెను కలిసిన కేశినేని శ్వేత
New Update

Vijayawada : విజయవాడ మున్సిపల్ కౌన్సిలర్ పదవికి తన కూతురు కేశినేని శ్వేత(Kesineni Swetha) ఈ రోజు రాజీనామా చేస్తుందని విజయవాడ(Vijayawada) ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు శ్వేతా 10.30 గంటలకు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫిసుకు వెళ్ళి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేయించుకొని మరుక్షణం తెలుగుదేశం పార్టీ(TDP) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుందని తన సోషల్ మీడియా(Social Media) ఖాతాల ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ గా రాజీనామా చేసే ముందు రాజకీయంగా తనకు సహకరించిన విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్(Gadde Ramamohan) ను కేశినేని శ్వేత మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.

Kesineni Swetha

ఇది కూడా చదవండి: AP Politics: అజ్ఞాతంలోకి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు.. గోదావరి జిల్లాల్లో ఏం అసలేం జరుగుతోంది?

#keshineni-nani #kesineni-swetha #tdp #andhra-pradesh #gadde-ramamohan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe