Kesineni Swetha : ఎమ్మెల్యే గద్దెను కలిసిన కేశినేని శ్వేత ఈ రోజు పార్టీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం అవుతున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత.. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు రాజకీయంగా సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. By Nikhil 08 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Vijayawada : విజయవాడ మున్సిపల్ కౌన్సిలర్ పదవికి తన కూతురు కేశినేని శ్వేత(Kesineni Swetha) ఈ రోజు రాజీనామా చేస్తుందని విజయవాడ(Vijayawada) ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు శ్వేతా 10.30 గంటలకు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫిసుకు వెళ్ళి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేయించుకొని మరుక్షణం తెలుగుదేశం పార్టీ(TDP) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుందని తన సోషల్ మీడియా(Social Media) ఖాతాల ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ గా రాజీనామా చేసే ముందు రాజకీయంగా తనకు సహకరించిన విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్(Gadde Ramamohan) ను కేశినేని శ్వేత మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇది కూడా చదవండి: AP Politics: అజ్ఞాతంలోకి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు.. గోదావరి జిల్లాల్లో ఏం అసలేం జరుగుతోంది? #keshineni-nani #kesineni-swetha #tdp #andhra-pradesh #gadde-ramamohan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి