EX CM KCR: విద్యుత్ కొనుగోళ్లపై హైకోర్టుకు కేసీఆర్

TG: తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని అన్నారు. నిబంధనల ప్రకారమే విద్యుత్ కొనుగోలు జరిగిందని చెప్పారు.

New Update
Telangana Politics: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు!

EX CM KCR: తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని అన్నారు. నిబంధనల ప్రకారమే విద్యుత్ కొనుగోలు జరిగిందని చెప్పారు. ప్రతివాదులుగా కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి చేర్చారు. కాగా ఇటీవల ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీలతో లేఖ రాశారు కేసీఆర్. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు.

అసలేమైంది..

ఇటీవల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు ఉహించకని షాక్ తగిలింది. ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్‌కు నోటీసులు అందాయి. జస్టిస్ నర్సింహా రెడ్డి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన నోటీసులపై ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లోపేర్కొన్నారు. కాగా ఇటీవల ఇదే అంశంపై గతంలో నోటీసులు పంపగా ఎన్నికల దృష్ట్యా జులై 30 వరకు వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరిన విషయం తెలిసిందే.

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దృష్టి సారించింది. అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ విడుదల చేసింది. విద్యుత్ కొనుగోళ్లలో గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ ఆరోపణలు చేశారు. దీనిపై విచారణకు ఒక స్పెషల్ జడ్జితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.

Advertisment
తాజా కథనాలు