Petrol-Diesel: వాహనదారులకు బిగ్ షాక్.. 3 రూపాయలు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 3 రూపాయలు పెంచింది. జూన్ 15నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.99.84, డీజిల్ రూ.85.93గా ఉంది.

Petrol-Diesel: వాహనదారులకు బిగ్ షాక్.. 3 రూపాయలు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
New Update

Karnataka Govt Increases Petrol & Diesel Prices: వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 3 రూపాయలు పెంచింది. జూన్ 15న పెట్రోల్, డీజిల్‌పై పన్నును పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో కర్ణాటక సేల్స్ ట్యాక్స్ (KST) పెట్రోల్‌పై 25.92 శాతం నుంచి 29.84 శాతానికి పెరగగా.. డీజిల్‌పై 14.3 శాతం నుంచి 18.4 శాతానికి పెరిగింది. బెంగళూరులో ఇప్పుడు లీటర్ పెట్రోల్ రూ.99.84కు విక్రయిస్తుండగా, డీజిల్ రూ.85.93గా ఉంది.

Also Read: దక్షిణాఫ్రికాలో సంకీర్ణ ప్రభుత్వం.. రెండోసారి అధ్యక్షుడిగా రమాఫోసా

#karnataka #petrol-and-diesel
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe