అమీషాను దారుణంగా అవమానించిన కరీన.. మరీ అలా అనేసిందేంటి

బాలీవుడ్ నటి కరీనా కపూర్ సహా నటి అమీషా పటేల్ క్యారెక్టర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అమీషా అంటే తనకు పడదంటూ పరోక్షంగా చెప్పేసింది. 'కాఫీ విత్ కరణ్‌ సీజన్ 8' షోలో కరీన మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

అమీషాను దారుణంగా అవమానించిన కరీన.. మరీ అలా అనేసిందేంటి
New Update

Kareena Kapoor: బాలీవుడ్ నటి కరీనా కపూర్ సహా నటి అమీషా పటేల్ (Amisha Patel) క్యారెక్టర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ సినిమా విషయంలో తామిద్దరి మధ్య విభేదాలున్నాయనే వార్తలపై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన నటి.. మరోసారి అమీషా అంటే తనకు పడదంటూ పరోక్షంగా చెప్పేసింది. అంతేకాదు అమీషా గురించి మాట్లాడేందుకు కూడా ఇష్టపడకపోవడం విశేషం. కాగా ప్రస్తుతం కరీన వ్యాఖ్యలు మరోసారి ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.

ఈ మేరకు ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్ హోస్ట్ చేస్తున్నషో 'కాఫీ విత్ కరణ్‌ సీజన్ 8' (Koffee With Karan 8)  షో తాజా ఎపిసోడ్ లో పాల్గొన్నకరీనా కపూర్ (Kareena Kapoor) తన కెరీర్ అండ్ పర్సనల్ విషయాల గురించి ఓపెన్ అయింది. ఈ క్రమంలో అమీషా పటేల్‌తో గొడవ జరిగింది నిజమేనా? మీరు ఆమెతో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అని కరణ్ నటి కరీనను ప్రశ్నించారు. అయితే దీనిపై స్పందించిన కరీన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఆమె గురించి తానేమీ మాట్లాడలేనని, తనకు ఇష్టంలేదని చెప్పింది. అయినా తగ్గని కరణ్.. ఇటీవల జరిగిన 'గదర్‌ 2' పార్టీకి మీరు ఎందుకు హాజరు కాలేదు. నీకు షాపటేల్‌కు మధ్య ఏదో హిస్టరీ ఉందంటున్నారు? 'కహో నా.. ప్యార్‌ హై' మీరు చేయాల్సిన సినిమా కదా? అంటూ డైరెక్ట్ అడిగేశాడు. దీంతో 'ఆ విషయం గురించి నేను ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. అది గతంలో జరిగిపోయిన సంఘటన. ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదనుకుంటాను. అయినా అమీషా గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు. మాట్లాడను' అని బదులిచ్చింది కరీన.

Also read : మళ్లీ అడ్డంగా బుక్కైన రష్మిక.. పెళ్లికి ముందే అత్తగారింట్లో దీపావళి సెలబ్రేషన్స్

ఇక ఈ ఇష్యూ ఇంతటితో ముగియగా దీపికా పదుకొణె మీకు పోటీ అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'నాకు తెలిసి ఇది అలియాను అడగాల్సిన ప్రశ్న. నన్ను కాదు'అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా కరీనకు ఇంకా పొగరు తగ్గలేదంటున్నారు నెటిజన్లు. ఇదిలావుంటే.. హృతిక్‌రోషన్‌ హీరోగా పరిచయమైన 'కహోనా ప్యార్‌ హై' సినిమాను హృతిక్‌ తండ్రి రాకేశ్‌ రోషన్‌ తెరకెక్కించగా ఇందులో ముందుగా కరీనాకపూర్‌ను తీసుకున్నారు. కానీ రాకేశ్ రోషన్‌తో విభేదాలు తలెత్తడంతో కరీనను తప్పించారు. చివరగా అమీషా పటేల్ నటించింది. 2000లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సూపర్‌హిట్‌గా నిలిచింది.

#kareena-kapoor #amisha-patel
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe