Chennamaneni: చెన్నమనేని కృషిని గుర్తిస్తూ..కాళేశ్వరం ప్యాకేజీ 9కి ఆయన పేరు

తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, దివంగత చెన్నమనేని రాజేశ్వర్ రావు శత జయంతి సందర్భంగా వారు చేసిన సామాజిక సేవను గుర్తిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 9 చెన్నమనేని రాజేశ్వర్ రావు పేరు పెడుతూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

Chennamaneni: చెన్నమనేని కృషిని గుర్తిస్తూ..కాళేశ్వరం ప్యాకేజీ 9కి ఆయన పేరు
New Update

సేవను గుర్తిస్తూ..

తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త,ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, దివంగత చెన్నమనేని రాజేశ్వర్ రావు శత జయంతి సందర్భంగా (ఆగస్టు 31), వారు చేసిన సామాజిక సేవను గుర్తిస్తూ సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల పరిధిలో సాగునీరును తాగునీరును అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 9 (మల్కపేట రిజర్వాయర్‌తో పాటు దాని పరిధిలోని కాల్వలకు మిడ్ మానేర్ నుంచి అప్పర్ మానేర్ దాకా)కు ‘‘చెన్నమనేని రాజేశ్వర్ రావు’’ పేరు పెడుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు.

పోరాడిన చరిత్ర.. సస్యశ్యామలం  

ఈ సందర్భంగా వారి సామాజిక సేవలను సీఎం స్మరించుకున్నారు. సీఎం మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడుగా, తెలంగాణ మొదటి తరం రాజకీయ వేత్తగా, నిరంతరం ప్రజలకోసం చెన్నమనేని రాజేశ్వర్‌రావు పోరాడిన గొప్పనేత అని అన్నారు. తెలంగాణ రైతాంగం కోసం ఆనాటి కాలంలోనే వరద కాల్వ కోసం ఎత్తిపోతల పథకాల కోసం పోరాడిన చరిత్ర ఆయనదన్నారు. మెట్టప్రాంతమైన సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల పరిధిలని రైతాంగానికి సాగునీటిని అందించడంతో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు. అంతేకాకుండా పలు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి ఆ ప్రాంత ప్రజల సాగునీరు, తాగునీరు కష్టాలను తీర్చడానికి ఎత్తిపోతల పథకం కోసం చెన్నమనేని రాజేశ్వర్‌రావు ఎన్నో పోరాటాలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులతో వాదించారు. చుట్టూ 5 గ్రామాలకు సుమారు 25 వందల ఎకరాలకు సాగునీరు అందించి బీడు భూములు సస్యశ్యామలం చేసిన ఘటన చెన్నమనేనిది.

ఉత్తర్వులు జారీ

నాటి వారి ఆకాంక్షలను ప్రతిఫలించే విధంగా స్వరాష్ట్రంలో సాగునీరు ప్రాజెక్టులను ఎత్తిపోతల పథకాలను నిర్మించుకున్నాం. తెలంగాణ రైతాంగం నేడు దేశం గర్వించే స్థాయిలో పంటలు పండిస్తున్నారు. వారు ప్రజాప్రతినిధిగా పనిచేసిన ప్రాంత ప్రజలకు కాళేశ్వరం పథకంలో భాగంగా నిర్మించిన ప్యాకేజీ 9 ద్వారా సాగునీరు అందుతున్నది. మిడ్ మానేర్ (ఎస్ఆర్ఆర్) నుంచి ఎత్తిపోతల ద్వారా అప్పర్ మానేర్ దాకా నీటి సరఫరా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో నాటి వారి కృషిని గుర్తిస్తూ, వారిని గౌరవిస్తూ, మల్కపేట రిజర్వాయర్ కు దాని పరధిలోని ఎత్తిపోతల పథకానికి మొత్తంగా ప్యాకేజీ 9కు చెన్నమనేని రాజేశ్వర్ రావు పెట్టడం జరిగిందని సీఎం తెలిపారు.సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నది.

#cm-kcr #kaleswaram-package-9 #chennamaneni
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి