సీఎం వీడియో కాన్ఫరెన్స్ కు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా.. వైసీపీలో అసలేం జరుగుతోంది?

సీఎం జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు హాజరుకాకపోవడం చర్చనియాంశమైంది. రానున్న ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతోనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
CM Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఫైనల్

వైసీపీలో (YCP) అభ్యర్థుల మార్పు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. టికెట్ దక్కదన్న సమాచారం అందుకున్న పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే అలకబూనారు. పలువురు పార్టీ మారేందుకు కూడా సిద్ధం అవుతున్నారన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఈ రోజు సీఎం జగన్ (CM Jagan) సెక్రటేరియట్ నుంచి 3 వేల పించన్ పధకాలకి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే.. కాకినాడ కలెక్టరేట్ లో సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కి పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి: YS Sharmila: షర్మిల ఏ పార్టీలో అయినా చేరొచ్చు.. పవన్ సీటును డిసైడ్ చేసేది టీడీపీనే: మంత్రి అమర్నాథ్

ఈ వీడియో కార్ఫరెన్స్ లో జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ గీతా పాల్గొన్నారు. అయితే.. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు మాత్రం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ కాన్ఫరెన్స్ కు హాజరుకాలేదు. దొరబాబుకు పిఠాపురం సీటును సీఎం జగన్ నిరాకరించారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ సొంత వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారు.

అధికారుల నుంచి సమాచారం వచ్చినా.. ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్పందించలేదని తెలుస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా ఈ కాన్ఫరెన్స్ కు హాజరుకాలేదు. ఆయన కూడా టికెట్ విషయంలో పార్టీపై అసంతృప్తితో ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు