AP: స్కూల్ బస్సు బోల్తా..విద్యార్థిని మృతి!

అన్నమయ్య జిల్లా ఓబులవారి పాలెం వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో భవిష్య అనే ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలను కోల్పోయింది. బస్సు రోడ్డు పై ఉన్న రాయిని ఎక్కడంతో బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్‌ కండీషన్‌ లో లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

AP: స్కూల్ బస్సు బోల్తా..విద్యార్థిని మృతి!
New Update

Kadapa School Bus Accident: కండిషన్‌ లో లేని ఓ స్కూల్ బస్సు ఓ చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లా ఓబులవారి పాలెం లో జరిగింది. విద్యార్థులను ఎక్కించుకుని వెళ్తున్న శ్రీవాణి పబ్లిక్ స్కూల్‌ బస్సు రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల పాప భవిష్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

రోడ్డుకు అడ్డంగా ఉన్న రాయి పైకి బస్సు ఎక్కడం వల్ల తిరగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో బస్సు తలుపు పక్కనే కూర్చుని ఉన్న చిన్నారి ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోయింది. బస్సు బాలిక పై బోల్తా పడడంతో పాప చనిపోయింది. జేసీబీ సాయంతో బస్సును పక్కకు తొలగించగా..బస్సు కింద చిన్నారి కనిపించింది.

అన్నమయ్య జిల్లాలో స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్‌ లేకపోయినా రవాణా శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఘటనలో విద్యార్ధిని ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Also Read: పెళ్లి పందిట్లో వరుడి పై యాసిడ్‌ దాడి..ఎక్కడంటే!

#annamayya-district #overtturned #school-bus #obulavaripalem
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి