బ్రిటిన్ లో కబడ్డీ రగడ..7గురు భారతీయులు అరెస్ట్ !

బ్రిటన్‌లో జరిగిన ఓ కబడ్డీ టోర్నమెంట్ మ్యాచ్‌లో తలెత్తిన వివాద ఘటనలో ఏడుగురు భారతీయ సంతతికి చెందిన యువకులు అరెస్ట్ అయ్యారు.ఈస్ట్ మిడ్‌లాండ్స్‌లోని డెర్బీ నగరంలో బ్రిటీష్ కబడ్డీ ఫెడరేషన్ నిర్వహించే టోర్నమెంట్ లో ఇరు జట్లు ఆయుధాలతో దాడి చేసుకోవటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

బ్రిటిన్ లో కబడ్డీ రగడ..7గురు భారతీయులు అరెస్ట్ !
New Update
బ్రిటన్‌లో జరిగిన ఓ కబడ్డీ టోర్నమెంట్ మ్యాచ్‌లో తలెత్తిన వివాద ఘటనలో ఏడుగురు భారతీయ సంతతికి చెందిన యువకులు అరెస్ట్ అయ్యారు.ఈస్ట్ మిడ్‌లాండ్స్‌లోని డెర్బీ నగరంలో బ్రిటీష్ కబడ్డీ ఫెడరేషన్ నిర్వహించే వార్షిక కబడ్డీ టోర్నమెంట్  దీనికి భారతీయ సంతతికి చెందిన పంజాబీ కమ్యూనిటీ హాజరయ్యారు.

బ్రిటీష్ కబడ్డీ ఫెడరేషన్ నిర్వహించే వార్షిక కబడ్డీ టోర్నమెంట్ బ్రిటన్‌లోని ఈస్ట్ మిడ్‌లాండ్స్‌లోని డెర్బీ నగరంలో జరుగుతుంది. ఈ ఏడాది యథావిధిగా ప్రారంభమైంది. దీనికి భారతీయ సంతతికి చెందిన పంజాబీ కమ్యూనిటీ హాజరయ్యారు.మ్యాచ్ లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అది కాస్త వివాదానికి దారితీసింది. అనంతరం వారు ఆయుధాలతో పరస్పరం దాడి చేసుకున్నారు. పలువురు ఆటగాళ్లు గాయపడ్డారు.

మ్యాచ్‌లో పాల్గొనేందుకు వచ్చిన కొందరు ఆటగాళ్ల వద్ద తుపాకులు, కత్తులు, బ్లేడ్లు వంటి ఆయుధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అనంతరం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఏడుగురు భారతీయ సంతతికి చెందిన యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

#kabaddi #britain
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe