KA Paul: అభివృద్ధి కావాలంటే అమెరికా రండి.. చంద్రబాబు, రేవంత్‌కు పాల్ పిలుపు

కేఏ పాల్ కీలక ప్రకటన చేశారు. అమెరికాలో అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో గ్లోబల్ పీస్ ఎకానమీట్ సమ్మిట్ జరుగుతుందన్నారు. ఈ సమ్మిట్‌కు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు చెప్పారు. రాష్ట్రాలు అభివృద్ధి కావాలంటే సీఎంలు అమెరికాకు రావాలని పిలుపునిచ్చారు.

KA Paul: ఈ ఎన్నికలు ఈవీఎంల మాయ.. కేఏ పాల్ సెన్సేషనల్ కామెంట్స్..!
New Update

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో అమెరికాలో గ్లోబల్ పీస్ ఎకానమీట్ సమ్మిట్ జరుగుతుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను ఈ సమ్మిట్ కు ఆహ్వానించినట్లు చెప్పారు. ఖజానా ఖాళీ అయింది అని చంద్రబాబు అసెంబ్లీ లో బాధ పడ్డారని.. రాజకీయ నాయకులు కేసుల్లో ఉండి.. అభివృద్ధి చేయడం లేదని అన్నారు. విదేశాల్లో తిరిగి రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో వచ్చారని అన్నారు. చంద్రబాబు ను పొలిటికల్ గా కలవడం లేదని.. గ్లోబల్ సమ్మెట్ కి మాత్రం హాజరు కావాలని కోరుతున్నట్లు తెలిపారు.

హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వాలేదని ఫీల్ వేసినట్లు చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే మనకు రాయతీలు వస్తాయని అన్నారు. ఇన్వెస్ట్మెంట్ కౌన్సిలర్స్ డిసైడ్ చేయరు.. ప్రసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ చేస్తారని అన్నారు. ఎన్డీయేకి మద్దత్తు ఇచ్చే ముందు డిమాండ్ చేయకుండా అడుక్కుంటే ఏమి రావని చురకలు అంటించారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి ఎమ్ ఇవ్వలేదని మండిపడ్డారు. అమరావతి కి 15వేల కోట్లు అప్పు ఇస్తామని అంటుంది..అప్పు మనకెందుకు అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. రాష్టానికి ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే చంద్రబాబు అమెరికా రావాలని అన్నారు.

Also Read: తెలంగాణలో మరో ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ

#ka-paul
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe