ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న భీకర దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ మిలిటెంట్లు చేపట్టిన దాడిలో మెజారిటీ పాలస్తీనియన్లకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. వారు చేసిన దాడుల వల్ల ఆ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయన ట్విట్టర్లో పోస్టు పెట్టారు. గత వారం హమాస్ దాడులు ప్రారంభమైన అనంతరం ఇజ్రాయెల్కు అండగా ఉంటామని బైడెన్ ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇజ్రాయెల్పై జరిగిన దాడులను శత్రువులెవరూ వినియోగించుకోవద్దని ఈ సందర్భంలో హెచ్చరికలు చేశారు. అప్పటి నుంచి హమాస్ మిలిటెంట్లతో పోరాడేందుకు బైడెన్ సహాయ సహకారాలను అందిస్తూ వస్తున్నారు. మరోవైపు అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్ కూడా తన ఇజ్రాయెల్ పర్యటనలో ఇదే విధమైన మద్దతును ప్రకటించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో భేటీ పూర్తైన అనంతరం అమెరికా ఉనికిలో ఉన్నంత వరకు మేము మీ వైపే ఉంటామని చెప్పారు.
పూర్తిగా చదవండి..Joe Biden: హమాస్ దాడులపై మెజార్టీ పాలస్తీనియన్లకు సంబంధం లేదు.. జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు
ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న భీకర దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ మిలిటెంట్లు చేపట్టిన దాడిలో మెజారిటీ పాలస్తీనియన్లకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. వారు చేసిన దాడుల వల్ల ఆ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయన ట్విట్టర్లో పోస్టు పెట్టారు.
Translate this News: