జీవన్ ధార ఔషధం ఉచితం: మంత్రి హరీష్‌రావు

New Update
జీవన్ ధార ఔషధం ఉచితం: మంత్రి హరీష్‌రావు
Jeevan Dhara medicine is free Minister Harish Rao 

ఆయుర్వేదానికి ఆదరణ

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పోలీసు కన్వెన్షన్ హాల్‌లో తెలంగాణలో ఆయుర్వేదిక్ వైద్యులకు బీఆర్ఎస్‌ హయాంలో ఆయుర్వేదానికి లభిస్తున్న ఆదరణకు విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆయూష్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరంగపాణి, సమన్వయ కర్త శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి హరీష్‌రావు పాల్గొని మాట్లాడుతూ.. ఆయుర్వేద వైద్యులకు హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లలో సేవలు అందించే ఒక గొప్ప అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. 1154 మందికి ఎంఎల్‌హెచ్‌పీగా అవకాశం కల్పించాం. మొత్తం 3071 మందిలో మీరు మూడో వంతు ఉన్నారు. కరోనా సమయంలో ప్రపంచమంతా తలకిందులైతే, ఆయుర్వేదం ఒక్కటే భరోసాను ఇచ్చింది. ప్రభుత్వ ఆయుర్వేద ఫార్మసీ ద్వారా తయారు చేసిన జీవన్ ధార అనే ఔషధాన్ని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసింది.

అగ్రస్థానంలో ఉన్నాం

కరోనా సెకండ్ వేవ్‌లో సోకిన బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రపంచాన్ని భయపెట్టింది. మందులు కూడా లేని సమయంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయుర్వేద కళాశాల వైద్య బృందం ఎంతో పరిశోధించి బ్లాక్ ఫంగస్‌కు మెడిసిన్ ఆవిష్కరించింది. బ్లాక్ ఫంగస్‌కు ఔషధం కనుగొనడం తెలంగాణలో జరగటం మనందరికి గర్వకారణం. క్వారెంటైన్ సెంటర్‌గా ఆయుష్‌కు సంబంధించిన 4 ఆసుపత్రులు నేచురోపతి, టిబ్బి, బీఆర్కేఆర్, హోమియో ఆస్పత్రులు విశేష సేవలందించాయి. రెండు దఫాలుగా చేసుకున్న కంటి వెలుగు కార్యక్రమంలో మీరు మంచి సేవలు అందించారు. మీ అందరికీ అభినందనలు. శుభాకాంక్షలు. వైద్య రంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ ఆయుష్ చికిత్సల్లో కూడా అగ్రస్థానంలో ఉండాలని సీఎం కేసీఆర్ ఆలోచన.

అన్ని రంగాల్లో హబ్‌

హైదరాబాద్‌లో చికిత్స పొందేందుకు దేశ విదేశాల నుంచి ఇక్కడికి పేషెంట్లు వస్తుంటారు. ఆయుష్ వైద్యం పొందేందుకు సైతం విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేలా ఎదగాలి. ప్రకృతి వైద్యానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా నిలిపేలా ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మీ అందరి భాగస్వామ్యం కావాలి. సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. తెలంగాణలో 834 ఆయుష్ డిస్పెన్సరీలు, 5 కాలేజీలు, 4 రీసెర్చ్ హాస్పిటల్స్ ఉన్నాయి. సిద్ధిపేట, వికారాబాద్, భూపాలపల్లిలో 50 పడకల కొత్త ఆయుష్ ఆస్పత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయి. అన్నీ జిల్లాలకు విస్తరించే ఆలోచన సీఎం చేస్తున్నారు. అనంతగిరి హిల్స్‌లో జిందాల్ ఆయుర్వేద ఆస్పత్రిని మించి సెంటర్ ప్రారంభిస్తాం. హైద్రాబాద్ ప్రతి రంగంలో హబ్‌గా మారుతున్నది. ఫార్మా, టికా, ఐటీ రంగంలో వైద్యంలో కూడా తెలంగాణ హబ్‌గా మారింది. ఇపుడు ఆయుర్వేదంలో కూడా హబ్‌గా మారుతుంది. 9 ఏండ్లలో వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి చెందింది. నీతి అయోగ్ ఇండెక్స్‌లో 2014లో తెలంగాణ 11 ఉంటే, ఇప్పుడు 3వ స్థానానికి ఎగబాకిందని మంత్రి హరీష్‌రావు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు