AP: పిఠాపురంలో జనసైనికుల ఆందోళన.. పవన్ కళ్యాణ్ కు అవమానం?

పిఠాపురంలో జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌పై స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఫొటో పెట్టకపోవడంపై నిరసనకు దిగారు. ఎన్టీఆర్‌, చంద్రబాబుతో పాటు పవన్‌ ఫొటో కూడా పెట్టాలని డిమాండ్‌ చేశారు.

AP: పిఠాపురంలో జనసైనికుల ఆందోళన.. పవన్ కళ్యాణ్ కు అవమానం?
New Update

Pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో జనసేన శ్రేణులు ఆందోళన చేపట్టారు. పిఠాపురంలో అన్నా క్యాంటీన్‌పై (Anna Canteens) స్థానిక ఎమ్మెల్యే, పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) ఫొటో పెట్టకపోవడంపై నిరసనకు దిగారు. ఎన్టీఆర్‌, సీఎం చంద్రబాబుతోపాటు పవన్‌ ఫొటో కూడా పెట్టాలని డిమాండ్‌ చేపట్టారు.



పవన్‌ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆయన ఫొటో పెట్టకపోవడంతో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్‌పై ఆయన ఫొటో పెట్టాలని.. పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ఏంతో కృషి చేసిన పవన్‌ కళ్యాణ్ పెట్టకపోవడంతో జనసేన నేతలు మండిపడుతున్నారు. పవన్‌నే అవమానిస్తారా.. అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌కు సైతం జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.

Also Read: దిగజారిపోయిన బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి.. పన్నెండేళ్ల తరువాత మళ్ళీ ఇలా..

#pawan-kalyan #chandrababu-naidu #anna-canteens #pithapuram
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe