రానున్న ఏపీ ఎన్నికల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో ఉన్న జనసేన పార్టీకి (Janasena Party) కొత్త టెన్షన్ వెంటాడుతోంది. జనసేనకు ఇప్పటి వరకు గ్లాస్ గుర్తు ఉంది. ఈ గుర్తే ప్రజల్లోకి వెళ్లింది. దీంతో ఈ సారి ఆ గుర్తు వస్తుందా? రాదా? అన్న టెన్షన్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. హైదరాబాద్ కేంద్రంగా జాతీయ జనసేన పార్టీని (JJSP) డి.నాగేశ్వరరావు ఏర్పాటు చేశారు. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Rythu Bandhu : రైతుబంధుపై కొత్త రూల్స్ ఇవే.. అలాంటి భూములకే సాయం?
ఇప్పటికే ఆ పార్టీకి ఈసీ బకెట్ గుర్తును కేటాయించింది. అయితే తమకు గ్లాస్ గుర్తును కేటాయించాలని ఈసీకి JJSP విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుతం గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంది. ఈ నేపథ్యంలో ఈసీ గ్లాస్ గుర్తును ఎవరికి కేటాయిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.