Janasena Party: పవన్కు బిగ్షాక్.. పోటీలో జాతీయ జనసేన పార్టీ! పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి నాగేశ్వరరావు అనే వ్యక్తి షాక్ ఇచ్చారు. హైదరాబాద్ కేంద్రంగా జాతీయ జనసేన పార్టీని పెట్టిన ఆయన.. ఫ్రీ సింబల్ లిస్ట్ లో ఉన్న గ్లాస్ గుర్తును తనకు కేటాయించాలని ఈసీని కోరుతున్నారు. By Nikhil 23 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి రానున్న ఏపీ ఎన్నికల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో ఉన్న జనసేన పార్టీకి (Janasena Party) కొత్త టెన్షన్ వెంటాడుతోంది. జనసేనకు ఇప్పటి వరకు గ్లాస్ గుర్తు ఉంది. ఈ గుర్తే ప్రజల్లోకి వెళ్లింది. దీంతో ఈ సారి ఆ గుర్తు వస్తుందా? రాదా? అన్న టెన్షన్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. హైదరాబాద్ కేంద్రంగా జాతీయ జనసేన పార్టీని (JJSP) డి.నాగేశ్వరరావు ఏర్పాటు చేశారు. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: Rythu Bandhu : రైతుబంధుపై కొత్త రూల్స్ ఇవే.. అలాంటి భూములకే సాయం? ఇప్పటికే ఆ పార్టీకి ఈసీ బకెట్ గుర్తును కేటాయించింది. అయితే తమకు గ్లాస్ గుర్తును కేటాయించాలని ఈసీకి JJSP విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుతం గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంది. ఈ నేపథ్యంలో ఈసీ గ్లాస్ గుర్తును ఎవరికి కేటాయిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. #janasena #pawan-kalyan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి