AP News: నాదెండ్ల మనోహర్ పై జనసైనికుల దాడి..!

టీడీపీ, జనసేన సీట్ల కేటాయింపు రెండు పార్టీల మధ్య చిచ్చురేపింది. తొలి జాబితాలో ఒక్కసీటుకూడా కేటాయించకపోవడంపై తాడేపల్లి జనసేన నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. నాదేళ్ల మనోహర్ వెళ్లగా.. నిరసన సెగ తగిలింది. జనసేన కార్యకర్తలు ఆయనపై దాడి చేసే యత్నం చేశారు.

AP News: నాదెండ్ల మనోహర్ పై జనసైనికుల దాడి..!
New Update

AP News:  టీడీపీ, జనసేన సీట్ల కేటాయింపు చిచ్చు రేపిన సంగతి తెలిసిందే. ప్రధానంగా జనసేనకు సంబంధించిన తొలిజాబితాలో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో తాడేపల్లి జనసేన నేతలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈరోజు రోజు కూడా సీటు ఇస్తారన్న విషయంపై అధినేతలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాడేపల్లి పర్యటనలో ఉన్న నాదేండ్ల మనోహర్..బొలిశెల్లి వర్సెస్, విడివాడ రామచంద్రరావుల మధ్య గొడవలు జరిగాయి. తాడేపల్లి నియోజకవర్గానికి వచ్చిన నాదేండ్ల మనోహర్ పై జన సేన కార్యకర్తలు దాడి చేసేందుకు యత్నించారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకవచ్చారు. ఆ సయమంలో పెద్దెత్తున నాందేడ్ల మనోహర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతలోనే అక్కడికి చేరుకున్న బొలిశెట్టి శ్రీను, కందుల దుర్గేశ్ నాదేండ్లకు రక్షణగా నిలివడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#ap-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe