Kiran Royal: హరిరామ జోగయ్య సీఎం జగన్ కు లేఖ రాసే దమ్ముందా?: కిరణ్ రాయల్

హరిరామ జోగయ్య కాపులకు 40 సీట్లు ఇవ్వాలని, పవర్ షేరింగ్ కావాలని సీఎం జగన్ కు లేఖ రాసే దమ్ముందా అని ప్రశ్నించారు తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్. జనసేన టీడీపీ పొత్తు చెడగొట్టేందుకు రాసే ప్రేమలేఖలు ఇక మీదగ్గరే మడిచి పెట్టుకోండని కౌంటర్ వేశారు.

Kiran Royal: తిరుమలలో భక్తుల దోపిడీ.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే జరిగేది ఇదే: కిరణ్ రాయల్
New Update

Janasena Kiran Royal: తిరుపతిలో జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  సీనియర్ కాపు నేత హరిరామ జోగయ్యపై విమర్శలు గుప్పించారు. హరిరామజోగయ్య పవన్ కు లేఖలు రాస్తారని.. పవన్ తన మాట వినడం లేదంటాడని అన్నారు. కానీ కన్న కొడుకే హరిరామజోగయ్య మాట వినడం లేదని పేర్కొన్నారు.

Also Read: వివేక హత్య కేసు.. జగన్ పాత్రపై సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కాపులకు 40 సీట్లు ఇవ్వాలని, పవర్ షేరింగ్ కావాలని హరిరామ జోగయ్య సీఎం జగన్ కు లేఖ రాసే దమ్ముందా అని ప్రశ్నించారు. జనసేన టీడీపీ పొత్తు చెడగొట్టేందుకు రాసే ప్రేమలేఖలు ఇక మీ దగ్గరే మడిచి పెట్టుకోండని కౌంటర్ వేశారు. బలిజలు, కాపులు ఎవరూ హరిరామ జోగయ్య, ముద్రగడ లను నమ్మడం లేదని కామెంట్స్ చేశారు.

Also Read: కొత్త పెళ్లి కూతుర్లూ.. ఇది మీ కోసమే.. అత్తమామలను ఫ్లాట్‌ చేసే చిట్కాలు!

బలిజలు, కాపులు అమాయకంగా ఉన్నప్పుడు హరిరామజోగయ్య, ముద్రగడల ఆటలు సాగాయన్నారు. కానీ, పరిస్థితి ఇప్పుడు అలా లేదని అన్నారు. వైసీపీ మంత్రులు పవన్ ను విమర్శిస్తే హరిరామ జోగయ్య ఎందుకు అప్పుడు లేఖలు రాయలేదు..ఎందుకు మాట్లాడలేక పోయారని నిలదీశారు. కాగా, జనసేన పీఏసీ సభ్యుడిగా ఉన్న సీనియర్ కాపు నేత హరిరామ జోగయ్య పలుమార్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లేఖలు రాశారు. పొత్తులో భాగంగా 24 సీట్లు తీసుకోవటంపై ఖండించారు.

#andhra-pradesh #kiran-royal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe