జనసేనాని కోసం బత్తుల బలరామకృష్ణ ఏం చేస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఆ పార్టీ నేత బత్తుల బలరామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పవన్ కు రాజకీయంగా సకల యోగాలు సిద్ధించాలని కోరుతూ మహా చండీ సహిత రాజ్యశ్యామల యాగంను జరిపించనున్నారు. By Jyoshna Sappogula 21 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి JSP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Janasena Pawan Kalyan) కోసం ఆ పార్టీ నేత, తూర్పుగదావరి జిల్లా రాజానగరం జనసేన ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా సకల యోగాలు సిద్ధించాలని కోరుతూ మహా చండీ సహిత రాజ్యశ్యామల యాగంను జరిపించనున్నారు. ఈ నెల 22 నుండి 27 వరకు కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో యాగం నిర్వహించనున్నారని తెలిపారు. Also Read: కూతుర్ని ప్రేమించాడని యువకుడిని నగ్నంగా చితకబాది..ఏం చేశాడంటే..? ఈ విషయంపై జనసేన నేత బత్తుల బలరామ కృష్ణ మాట్లడారు. మహాయగం విశ్వశాంతి లోక కల్యాణం కోసం సుభిక్షంగా ఉండాలని యాగం చేపడుతున్నారని..అలాగే..శత కుందాత్మన..రాజా శ్యామల యాగం చేయనున్నామని వెల్లడించారు. వెయ్యి రుద్ర హోమాలు.. వెయ్యి రుద్ర అభిషేకాలు చేసి రుద్రుడు శంతించేల యాగం చేయబోతున్నామని వ్యాఖ్యనించారు. మహా చండికా దేవి అమ్మవారు అందరికీ శక్తిని ఇవ్వాలని.. జ్ఞానాన్ని ప్రసాదించాలని సరస్వతీ దేవికి..ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నామని అన్నారు. Also read: సిరిసిల్లలో బంతిలో దూరిన ఎలుక ఏం చేసిందో తెలుసా? వైరల్ గా మారిన ఫన్నీ వీడియో! రాష్ట్రంలో రాజు మారాలని ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా రాజ్యం బాగుండాలని రాజ్య శ్యామల యాగం చేపడుతున్నామన్నారు. ఈ యాగానికి పార్టీలకు సంబందం లేకుండా తరలి రావాలని పిలుపునిచ్చారు. తమిళనాడు కర్ణాటక కి చెందిన 300 ఋత్వికులు హజరై 300 మందితో 109 గుండాల్లో యాగం జరుగనుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక భావనతో చేస్తున్నాము.. రాజకీయం కోసం కాదు లోక కళ్యాణం కోసం చేస్తున్నామని వెల్లడించారు. #janasena #pawan-kalyan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి