Pawan Kalyan: ప్రధాని మోదీతో పవన్ ఫ్యామిలీ భేటీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన భార్య, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఎన్డీఏ కూటమి సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో పవన్ తన కుటుంబాన్ని మోదీకి పరిచయం చేశారు. By Bhavana 06 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Modi: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన భార్య, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఎన్డీఏ కూటమి సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం మరోసారి ఎన్టీఏ కూటమి సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ సమయం ఇవ్వడంతో పవన్ ఆయనతో భేటీ అయ్యారు. ఈక్రమంలో పవన్ తన కుటుంబాన్ని మోదీకి పరిచయం చేశారు. పవన్ తన వెంట కుమారుడు అకీరాను కూడా ప్రధానితో భేటీకి తీసుకెళ్లారు. అకీరా ఇటీవల పవన్ కల్యాణ్తో ఎక్కువగా కనిపిస్తున్నారు. చంద్రబాబునాయుడుతో సమావేశంలోనూ అకీరా కనిపించారు. ఈ సమావేశంలో పవన్ హ్యాట్రిక్ విజయం పై మోదీకి పవన్ శుభాకాంక్షలు తెలిపారు. పిఠాపురంలో పవన్ గెలుపు పై ప్రధాని అభినందనలు తెలిపారు. Sri @PawanKalyan garu with family met Prime Minister Sri @narendramodi ji. pic.twitter.com/txF3rasFg7 — JanaSena Party (@JanaSenaParty) June 6, 2024 జనసేనకు మంచి భవిష్యత్ ఉంటుందని మోదీ పేర్కొన్నారు. పవన్ కుటుంబంతో కలిసి రావడంతో ప్రధాని మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పవన్ కుమారుడు అకీరా తో మోదీ సరదాగా ముచ్చటించారు. మీ నాన్నలా నువ్వూ పవర్ స్టార్ అవ్వాలంటూ మోదీ జోకులు వేశారు. Also read: ఇక నుంచి కొత్త చంద్రబాబును చూస్తారు…అంటూ బాబు కీలక వ్యాఖ్యలు! #modi #pawan-kalyan #akira మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి