AP : ఈ జిల్లాల్లో జగన్, చంద్రబాబు చివరి ప్రచారం.. ఎక్కడెక్కడంటే?

ఏపీలో ఇవాళ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. చిత్తూరు, నంద్యాలలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనుండగా.. వైఎస్ జగన్ పల్నాడు, ఏలూరు జిల్లా, కాకినాడలో ప్రచారం చేయనున్నారు. జేపీ నడ్డా సైతం తిరుపతిలో కూటమి నేతలతో కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు.

New Update
AP : ఈ జిల్లాల్లో జగన్, చంద్రబాబు చివరి ప్రచారం.. ఎక్కడెక్కడంటే?

Election Campaign Last Day : ఏపీ(Andhra Pradesh)లో ఇవాళ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో  టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), వైసీపీ అధినేత జగన్(YS Jagan) నేడు ప్రచారాలతో హోరెత్తించనున్నారు. చంద్రబాబు నేడు రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. మ. 12.30 నుంచి 1.30 గంటల వరకు నంద్యాల సభలో పాల్గొంటారు. సాయింత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకు చిత్తూరు సభలో ప్రచారం చేయనున్నారు.

Also Read: ఏపీలో భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం.. ఎక్కడంటే

ఇదిలా ఉండగా.. సీఎం జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు జిల్లా కైకలూరు, మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగే బహిరంగ సభలో ప్రచారం చేయనున్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా(JP Nadda) సైతం తిరుపతిలో కూటమి నేతలతో కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు.

Advertisment
తాజా కథనాలు