IT Rides: డబ్బులే.. డబ్బులు.. ఆ ఎంపీ ఇంట్లో దొరికిన సొమ్ము తెలిస్తే అవాక్కవుతారు!

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు.. జార్ఖండ్ కు చెందిన ధీరజ్ సాహుకు చెందిన పలు ప్రాంతాల్లో నాలుగు రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ 300 కోట్ల రూపాయలకు పైగా లెక్కలేని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 7 గదులు, 9 లాకార్లు తెరవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

IT Rides: డబ్బులే.. డబ్బులు.. ఆ ఎంపీ ఇంట్లో దొరికిన సొమ్ము తెలిస్తే అవాక్కవుతారు!
New Update

IT Rides: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ.500 నోట్లు ఎక్కువగా దొరికాయి. డిసెంబర్ 6న కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన 10 చోట్ల ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో జరిపిన దాడుల్లో డబ్బులను లెక్కించేందుకు 40-50 మందిని నియమించారు. అదే సమయంలో నోట్ల లెక్కింపునకు 40 చిన్న, పెద్ద మెషీన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా 7 గదులు, 9 లాకర్లు తెరవాల్సి ఉంది. ఈ దాడిలో చాలా డబ్బు దొరికింది, లెక్కించడానికి కొన్ని గంటలే కాదు చాలా రోజులు పడుతోంది. డబ్బు చాలా ఉంది, దానిని ఉంచడానికి ఒకటి కాదు, చాలా బీరువాలు అవసరం అవుతాయి. అయినా కూడా మిగిలిన డబ్బు చాలా సంచులలో నింపాల్సి వచ్చింది. జార్ఖండ్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ ధీరజ్‌ సాహు ఇంట్లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సోదాల్లో దొరికిన నల్లధనం పరిస్థితి ఇది. స్వాధీనం చేసుకున్న డబ్బును ఒడిశాలోని ఎస్‌బీఐ బలంగీర్‌ బ్రాంచ్‌కు (IT Rides)తీసుకొచ్చారు. ఈ డబ్బును మొత్తం 176 బస్తాల్లో తీసుకొచ్చారు. డబ్బుల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. భారతీయ చరిత్రలో ఏ ఏజెన్సీ నిర్వహించని అతిపెద్ద రికవరీగా దీనిని పరిగణిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ(IT Rides) డైరెక్టర్ జనరల్ సంజయ్ బహదూర్ ప్రకారం, ఇప్పటివరకు ఒకే ఆపరేషన్‌లో రికవరీ చేసిన అతిపెద్ద మొత్తం ఇదే. డిసెంబర్ 8న 40 పెద్ద, చిన్న యంత్రాల నుంచి ప్రారంభమైన నోట్ల లెక్కింపు శనివారం రాత్రి వరకు కొనసాగింది. ఈ దాడి తర్వాత, ధీరజ్ సాహు ఇంటి  సోదాల్లో దొరికిన నోట్ల కుప్ప చిత్రాలు వైరల్ అవుతున్నాయి.

ఎక్కువగా 500 నోట్లు

కాంగ్రెస్ ఎంపీలకు చెందిన పలుచోట్ల దాడులు (IT Rides)నిర్వహిస్తున్నారు. పట్టుబడిన నగదులో అత్యధికంగా రూ.500 నోట్లు ఉన్నట్లు సమాచారం. ధీరజ్ సాహు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం బృందం మూడు సూట్‌కేస్‌లను తీసుకొచ్చింది.ఈ సూట్‌కేసుల్లో ఆభరణాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. అయితే, ఇది ఇంకా ధృవీకరణ కాలేదు.

Also Read: చిన్న రాష్ట్రం.. మూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చుకుంది..

కాంగ్రెస్ దూరం..

ఈ విషయంలో కాంగ్రెస్ దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎంపీ ధీరజ్ సాహు వ్యాపారంతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో రాశారు. ఈ కేసులో ఇంత భారీ మొత్తంలో నగదు ఎలా రికవరీ అయ్యిందనే దానిపై సాహు వివరణ ఇవ్వాలని కూడా అందులో పేర్కొన్నారు.

ఎంపీ సాహు నుంచి ఎలాంటి స్పందన లేదు

అదే సమయంలో, ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ ప్రధాని మోదీతో సహా పలువురు సీనియర్ బిజెపి నాయకులు(IT Rides) అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ధీరజ్ సాహు కుటుంబం మద్యంతో పాటు హోటల్, రియల్ ఎస్టేట్, రవాణా -చేపల వేట వంటి అనేక ఇతర వ్యాపారాలు చేస్తుందని తెలుస్తోంది. అయితే నగదు స్వాధీనంపై ఎంపీ ధీరజ్ సాహు నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు.

Watch this interesting Video:

#congress-party #it-rides
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe