పొంగులేటి ఇంట్లో ప్రస్తుతం ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే పొంగలేటికి నామినేషన్ వేసేందేకు అనుమతి ఇస్తారా లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎట్టకేలకు దీనికి తెరపడింది. పొంగులేటి నామినేషన్ దాఖలు చేసేందుకు ఐటీ అధికారులు నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చారు. అంతేకాదు ఆయన వెంట ఐటీ అధికారులు కూడా ఉండనున్నారు. ఇక హైదరాబాద్ నుంచి ఖమ్మం రూరల్లోని రిటర్నింగ్ ఆఫీస్కు పొంగులేటి వెళ్లనున్నారు. అక్కడ నామినేషన్ దాఖల చేశాక మళ్లీ తిరిగి హైదరాబాద్ రానున్నారు.
పూర్తిగా చదవండి..Big Breaking: ఐటీ అధికారుల నిఘాలో నామినేషన్.. ఈసీకి పొంగులేటి కంప్లైంట్!
కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఐటీ అధికారులు నామినేషన్ వేసేందుకు నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చారు. పొంగులేటి వెంటే ఐటీ అధికారులు ఉండనున్నారు. ఖమ్మం రూరల్లోని రిటర్నింగ్ ఆఫీస్కు వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Translate this News: