IT Raids: హైదరాబాద్‌లో రెండోరోజు కొనసాగుతున్న ఐటీ తనిఖీలు

హైదరాబాద్‌లో రెండవ రోజు ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. శంషాబాద్, అమీర్‌పేట్, కూకట్‌పల్లితో సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అమీర్‌పేట్‌లోని పూజ కృష్ణ చిట్‌ఫండ్స్‌పై ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.

New Update
IT Raids: హైదరాబాద్‌లో రెండోరోజు కొనసాగుతున్న ఐటీ తనిఖీలు

హైదరాబాద్‌లో రెండవ రోజు ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. శంషాబాద్, అమీర్‌పేట్, కూకట్‌పల్లితో సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. అమీర్‌పేట్‌లోని పూజ కృష్ణ చిట్‌ఫండ్స్‌పై ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. డైరెక్టర్ సోంపల్లి నాగ రాజేశ్వరి పూజాలక్ష్మి ఎండీ కృష్ణ ప్రసాద్ ఇళ్లపై రెండో రోజు(శుక్రవారం) కూడా ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. శంషాబాద్‌లోని చిట్‌ఫండ్ సంస్థ యజమాని రఘువీర్ ఇల్లు, ఆఫీసులపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. కూకట్‌పల్లిలోనూ హిందూ ఫార్చునాల్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. చిట్ ఫండ్స్ ఫైనాన్స్ సంస్థల్లో ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలతో (శుక్రవారం) రెండవ రోజు కూడా ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.ఈ తనిఖీల్లో కీలకమైన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

100 బృందాలతో తనిఖీలు...

రాజధాని హైదరాబాద్‌లో మరోమారు ఆదాయపన్ను సోదాలు కలకలం రేపాయి. రెండు చిట్‌ఫండ్‌ సంస్థలతోపాటు వాటిలో భాగస్వామ్యం ఉందని భావిస్తున్న స్తిరాస్థి వ్యాపారులు, రైల్వే కాంట్రాక్టర్ల ఇళ్లలో 100 బృందాలు ఈ తనిఖీలు చేశారు. ఎల్లారెడ్డిగూడ, సాయిసారథినగర్‌లోని పూజాకృష్ణ చిట్‌ఫండ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. ఈ సంస్థకు కృష్ణప్రసాద్‌ దొప్పలపూడి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, సోమేపల్లి నాగరాజేశ్వరి, దొప్పలపూడి పూజాలక్ష్మి డైరెక్టర్లుగా ఉన్నారు. కార్యాలయం ఎదురుగానే ఉన్న వీరి ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో దాదాపు 10 వాహనాల్లో సీఆర్‌పీఎఫ్‌ బలగాల భద్రత మధ్య వచ్చిన అధికారులు ఏకకాలంలో కార్యాలయం, ఇళ్లలో తనిఖీలు చేశారు. ఇదే సమయంలో మరో పది వాహనాల్లో అధికారులు అమీర్‌పేటలోని పాన్‌కామ్‌ బిజినెస్‌ సెంటర్‌లో ఉన్న జీవన్‌శక్తి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో సంస్థకు రమేష్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, వెంకటేశ్వరరావు డైరెక్టర్‌గా ఉన్నారు.

ఇద్దరు వ్యాపారవేత్తల ఇళ్లలోనూ..

ఇక్కడ కూడా కార్యాలయం తలుపులు మూసేసి రాత్రి 7 గంటల వరకు సోదాలు చేశారు. మరోవైపు శంషాబాద్‌లోని మరో అయిదు బృందాలు సోదాలు చేశారు. ఆయనకు పలు చిట్‌ఫండ్‌ సంస్థల్లో భాగస్వామ్యం ఉన్నట్లు సమాచారం. ఖరీదైన విల్లాలు ఉండే గోల్డెన్‌ ఎన్‌క్లేవ్‌ ప్రధాన ద్వారాన్ని మూసివేయించి ఇతరులు ఎవర్నీ లోనికి అనుమతించ కుండా తనిఖీలు చేశారు. కూకట్‌పల్లిలోని ఇందూ ఫార్చున్‌విల్లాలో మరో ఇద్దరు వ్యాపారవేత్తల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. వీరిరువురూ రైల్వే కాంట్రాక్టు పనులు చేస్తుంటారని, చిట్‌ఫండ్‌ సంస్థల్లోనూ పెట్టుబడులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలు నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఆదాయపన్ను అధికారి ఒకరు వెల్లడించారు. ఆయాచోట్ల పలు కంప్యూటర్ల హార్డ్‌డిస్కులు, ధ్రువపత్రాలు, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: హైదరాబాద్‌కు జేపీ నడ్డా.. తెలంగాణలో బీజేపీ ఎన్నికల జోష్

Advertisment
తాజా కథనాలు