chandrayaan-3: శివశక్తి పాయింట్ చుట్టూ తిరుగుతున్న రోవర్‌.. కొత్త వీడియోలను రిలీజ్ చేసిన ఇస్రో!

రోవర్‌ తిరుగుతున్న వీడియోను ఇస్రో రిలీజ్ చేసింది. శివశక్తి పాయింట్ చుట్టు రోవర్‌ తిరుగుతున్నట్టు ట్విట్టర్‌లో ఓ వీడియో పెట్టింది. చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ తాకిన చంద్రునిపై ఉన్న ప్రదేశాన్ని 'శివశక్తి పాయింట్' అని పిలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు(ఆగస్టు 26) బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రకటించారు.

New Update
chandrayaan-3: శివశక్తి పాయింట్ చుట్టూ తిరుగుతున్న రోవర్‌.. కొత్త వీడియోలను రిలీజ్ చేసిన ఇస్రో!

Pragyan rover roams around Shiv Shakti Point Video: చంద్రయాన్‌-3 గురించి ఏ అప్‌డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్‌గా మారిపోతోంది. తాజాగా ఇస్రో మరో కొత్త వీడియో రిలీజ్ చేసింది. శివశక్తి పాయింట్ చుట్టు రోవర్‌ తిరుగుతున్నట్టు ట్విట్టర్‌లో ఓ వీడియో పెట్టింది. దటీజ్ ఇస్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రోవర్‌ బుజ్జిబుజ్జిగా అడుగులు వేస్తూ వీడియోలో క్లియర్‌గా కనిపిస్తోంది.


మోదీ ఏం అన్నారంటే:
చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ తాకిన చంద్రునిపై ఉన్న ప్రదేశాన్ని 'శివశక్తి పాయింట్' అని పిలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రకటించారు. చారిత్రాత్మక చంద్రయాన్-3 మిషన్ వెనుక ఉన్న శాస్త్రవేత్తలను కలవడానికి బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC) వద్ద ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. "చంద్రునిపై టచ్ డౌన్ స్పాట్ అని పేరు పెట్టడం ఒక కన్వెన్షన్. అలాగే విక్రమ్ ల్యాండర్ తాకిన ప్రదేశానికి ఇప్పుడు భారతదేశం కూడా పేరు పెట్టాలని నిర్ణయించుకుంది. ఆ పాయింట్‌ను ఇప్పుడు 'శివశక్తి పాయింట్' అని పిలుస్తాము" అని మోదీ చెప్పారు.

ఎందుకా పేరు?
శివశక్తి' పేరులోని 'శక్తి' మహిళా శాస్త్రవేత్తల కృషి, స్ఫూర్తి, సాధికారత నుంచి వచ్చిందని మోదీ చెప్పుకొచ్చారు. 2019లో చంద్రయాన్-2 క్రాష్‌ల్యాండ్ అయిన చంద్రునిపై ఉన్న బిందువుకు 'తిరంగా పాయింట్' అని పేరు పెట్టారు. "చంద్రయాన్ -2 విక్రమ్ ల్యాండర్ క్రాష్-ల్యాండర్ అయిన ప్రదేశానికి కూడా పేరు పెట్టాలని దేశం నిర్ణయించింది. ఆ సమయంలో అది సరిగ్గా లేదని భావించినందున ఆ పాయింట్‌కి పేరు పెట్టకూడదని భారత్‌ నిర్ణయించుకుంది. కానీ నేడు, చంద్రయాన్ -3 మిషన్ విజయవంతంగా ల్యాండ్ అయినప్పుడు చంద్రుడు, చంద్రయాన్-2 దాని గుర్తును వదిలిపెట్టిన ప్రదేశానికి పేరు పెట్టడం సరైనది. ఇప్పుడు మనకు "హర్ ఘర్ తిరంగా" ఉంది, తిరంగ చంద్రునిపై కూడా ఉంది కాబట్టి, ఆ బిందువుకు 'తిరంగా' అని పేరు పెట్టడం సముచితం. పాయింట్' అని మోదీ ప్రకటించారు.

చంద్రయాన్-4?
ఇక ఇస్రో గురించి మరో వార్త చక్కర్లు కొడుతోంది. 2026లో చంద్రయాన్-4 ఉంటుందని చెప్తూనే.. మరోవైపు దీనికోసం జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ , మన ఇస్రోతో చేతులు కలుపుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త ప్రాజెక్టును ల్యూనార్ పోలార్ ఎక్స్‌ప్లొరేషన్ మిషన్ అంటే లూపెక్స్ అని పిలుస్తామని.. ఈ ప్రయోగం జపాన్‌కు చెందిన హెచ్3 రాకెట్ ద్వారా జరగనుందని ప్రచారం జరుగుతోంది. కానీ, దీనిపై ఇస్రో ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ALSO READ: చంద్రయాన్-3 చుట్టూ ఫేక్ వీడియోలు చక్కర్లు..అసలు నిజం ఇదే..!!

ALSO READ: ఆ ప్రాంతానికి ‘శివశక్తి’, పాదముద్రను వదిలిన ప్రదేశానికి ‘తిరంగా’ అని నామకరణం..!!

Advertisment
తాజా కథనాలు