/rtv/media/media_files/2026/02/11/pakistan-defense-minister-2026-02-11-13-27-36.jpg)
అగ్రరాజ్యం అమెరికా దౌత్య నీతిపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి గతంలో అమెరికాతో కలిసి పని చేయడం తాము చేసిన అతిపెద్ద తప్పిదమని ఆయన బహిరంగంగా అంగీకరించారు. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ.. అమెరికా తన వ్యూహాత్మక అవసరాల కోసం పాకిస్థాన్ను వాడుకుందన్నారు. పని పూర్తయ్యాక 'టాయిలెట్ పేపర్' కంటే హీనంగా విసిరి పారేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ పార్లమెంట్లో ఒక రక్షణ మంత్రిగా ఉండి ఇలాంటి వాస్తవాలను అంగీకరించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇది అమెరికాతో పాకిస్థాన్కు ఉన్న సంబంధాల్లో పెరుగుతున్న దూరాన్ని స్పష్టం చేస్తోంది.
Khwaja Asif admits in Parliament that Pakistan rented itself out to the U.S. for war and was later discarded “like toilet paper”. Afghanistan was destroyed by policies now openly acknowledged in parliament. Millions suffered. Generations were lost. The world cannot look away now… pic.twitter.com/aEQjrm16ME
— Mariam Solaimankhil (@Mariamistan) February 10, 2026
గతంలో అఫ్గానిస్థాన్తో జరిగిన యుద్ధాల్లో పాకిస్థాన్ పాలుపంచుకోవడంతో దేశానికి భారీ నష్టం వాటిల్లిందని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా ఒత్తిడికి తలొగ్గి తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడటం వల్లే పాకిస్థాన్లో ఉగ్రవాదం పుట్టుకొచ్చిందని ఆయన విశ్లేషించారు. "వ్యూహాత్మక ప్రయోజనాల కోసం అమెరికా మమ్మల్ని ఒక కిరాయి దేశంలా వాడుకుంది. ఇప్పుడు అమెరికా అఫ్గాన్ నుండి వైదొలిగినా, ఆ యుద్ధం మిగిల్చిన హింస, ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం మాత్రం మమ్మల్ని వీడటం లేదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జిహాద్ పేరుతో మోసం
మాజీ మిలిటరీ పాలకులు జియా ఉల్ హక్, పర్వేజ్ ముషర్రఫ్లు తీసుకున్న నిర్ణయాలను ఆసిఫ్ తీవ్రంగా విమర్శించారు. అఫ్గాన్ యుద్ధంలో పాల్గొనడం ఇస్లాం మతం కోసమో లేదా జిహాద్ కోసమో కాదని, కేవలం అగ్రరాజ్యాన్ని సంతోషపెట్టడానికి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. యుద్ధాలను సమర్థించుకునేందుకు ఆనాడు విద్యా వ్యవస్థను సైతం మార్చేశారని, ఆ సిద్ధాంతపరమైన మార్పులు సమాజంపై ఇప్పటికీ కోలుకోలేని ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల దేశం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక నష్టాన్ని ఎన్నటికీ పూడ్చలేమని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. సొంత ప్రయోజనాలను విస్మరించి ఇతరుల యుద్ధాల్లో 'బొమ్మ'లా మారడం వల్ల పాకిస్థాన్ ఒంటరిదైందని ఆయన విశ్లేషించారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాద ముప్పు అంతా ఆనాటి 'బ్లోబ్యాక్' (ప్రతిచర్య) ఫలితమేనని ఆయన నిజాయితీగా అంగీకరించారు.
Follow Us