/rtv/media/media_files/2025/05/29/QAzlVFZrf1O5bTR6UiOX.jpg)
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 2023లో పంజాబ్ గవర్నర్ హౌస్లో జరిగిన ఓ అవార్డు పంక్షన్ లో పాక్ నటి మావ్రా హొకేన్కు అవార్డు ఇస్తూ కన్నార్పకుండా చూశాడు. దీంతో పాక్ పీఎం డీప్ స్కాన్ అంటూ పాక్ నెటిజన్లే ఆయన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్లోని ఒక యూట్యూబ్ ఛానెల్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. దాదాపు రెండు సంవత్సరాల క్రితం వీడియో అయినప్పటికీ పహల్గామ్ ఉగ్రవాద దాడిపై ఉద్రిక్తతల మధ్య ఇప్పుడు వైరల్ గా మారింది. ఎంతైనా ఆయన పురుషుడే కదా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Apparently Shehbaz Sharif is not that Sharif 😂😂 pic.twitter.com/RzzitJgJlI
— Cabinet Minister, Ministry of Memes,🇮🇳 (@memenist_) May 28, 2025
భారత్ ఆపరేషన్ సిందూర్
కాగా 2016లో 'సనమ్ తేరి కసమ్'తో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది నటి మావ్రా హొకేన్. ఈ నటి ఇటీవల వివాదంలో చిక్కుకుంది. భారత్ ఆపరేషన్ సిందూర్ను బహిరంగంగా విమర్శించింది. ఏప్రిల్ 22న కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది భారత టూరిస్టులు మరణించడంతో, మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించి పాక్ ఉగ్రవాద స్థావారలపై దాడి చేసింది. దీంతో కనీసం 100 మంది ఉగ్రవాదులను హతమయ్యారు. దాదాపు మూడు రోజుల పాటు ఇరు దేశాల మధ్య ఘర్షణ కొనసాగింది. మే 8, 9, 10 తేదీలలో పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ భారత్ గట్టి సమాధానం ఇచ్చింది.