Australia : ఆస్ట్రేలియాలో లోయలో పడి తెలుగు వైద్యురాలు మృతి! ఆస్ట్రేలియాలో స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపేందుకు ట్రెక్కింగ్ కు వెళ్లిన కృష్ణాజిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల(23) అనే యువతి ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి అక్కడికక్కడే మృతి చెందింది. By Bhavana 09 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Australia Doctor : ఆస్ట్రేలియా(Australia) లో లోయలో పడి కృష్ణా జిల్లా(Krishna District) కు ఉంగుటూరుకు చెందిన యువ వైద్యురాలు మృతి చెందింది. స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపేందుకు ట్రెక్కింగ్(Trekking) కు వెళ్లిన కృష్ణాజిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల(Vemuru Ujvala) (23) అనే యువతి ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి అక్కడికక్కడే మృతి చెందింది.ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్ లోని బాండ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఎంబీబీఎస్(MBBS) పూర్తి అయిన తరువాత ఆమె రాయల్ బ్రిస్బెన్ ఉమెన్స్ హాస్పిటల్(Royal Brisbane Women's Hospital) లో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తునే పీజీ చేసి ఉన్నత స్థానానికి వెళ్లాలని ఆమె భావించింది. ఈ క్రమంలోనే ఆమె మార్చి 2 వ తేదీన సరదాగా తోటి స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లింది. అక్కడ ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించింది. ఆమె చనిపోయిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఉజ్వల తల్లిదండ్రులు మైథిలి, వెంకటేశ్వరరావు చాలా సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో స్థిరపడిపోయారు. ఉజ్వల మృతదేహన్ని అంత్యక్రియల కోసం కృష్ణాజిల్లాలోని ఉంగుటూరు మండలం ఎలుకపాడుకి తీసుకురానున్నారు. Also Read : పేరు మార్చుకున్న సాయిధరమ్ తేజ్ ..ఇక నుంచి ఆ పేరుతోనే #krishna-district #australia #vemuru-ujvala #indian-female-doctor #unguturu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి