2026 టీ20 ప్రపంచకప్‌కు పాక్,భారత్ రాదు.. పాక్ బోర్డు కీలక ప్రకటన!

2026లో జరిగే టీ20 వరల్డ్ కప్ కు పాకిస్తాన్ జట్టు భారత్ లో పర్యటించదని ఆ దేశ బోర్డు కీలక ప్రకటన చేసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్,పాక్ కు రాకపోతే తాము టీ20 వరల్డ్ కప్ కు రాబోమని పాక్ బోర్డు వెల్లడించింది.దీంతో ICCకి ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.

2026 టీ20 ప్రపంచకప్‌కు పాక్,భారత్ రాదు.. పాక్ బోర్డు కీలక ప్రకటన!
New Update

2025లో పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్‌లో భద్రతా కారణాల దృష్ట్యా తాము పాల్గొనలేమని భారత క్రికెట్ జట్టు ప్రకటించింది. కొన్ని ఏళ్లగా భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న రాజకీయ సమస్యల నేపథ్యంలో ఇరు దేశాలు ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్‌లలో పాల్గొనడం మానుకున్నాయి.కేవలం ఐసీసీ, ఆసియా కప్ వంటి సిరీస్‌లు రెండు జట్లు ఆడుతున్నాయి. ఈ స్థితిలో 2023లో పాకిస్థాన్‌లో జరిగిన ఆసియా కప్‌కు భారత జట్టు పాల్గొనకూడదని భావించింది.కానీ ఐసీసీ భారత్ తో జరిగే మ్యాచ్ లు  హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించింది.

ఆ తర్వాత భారత్‌లో జరుగుతున్న 50 ఓవర్ల ప్రపంచకప్ క్రికెట్ సిరీస్‌కు తాము రాలేకపోయామని, ఆ తర్వాత వచ్చి ఆడటం తప్ప మరో మార్గం లేదని పాకిస్థాన్‌ చెప్పింది. ఈ స్థితిలో పాక్ జట్టు భారత్‌కు రావడంతో భారత్ కూడా తిరిగి పాకిస్థాన్‌కు వెళ్తుతుందని అంతా భావించారు. అయితే అప్పుడే ఓ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్‌కు రాలేమని చెప్పిన బీసీసీఐ.. హైబ్రిడ్ విధానంలో దుబాయ్ లేదా శ్రీలంకలో మ్యాచ్‌లు నిర్వహిస్తే వచ్చి ఆడతామని చెప్పడం పాక్ క్రికెట్‌ బోర్డు కే కాదు ICCకి కూడా షాకిచ్చింది.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా స్పందించింది. 2026 టీ20 వరల్డ్‌కప్‌ను భారత్‌లో నిర్వహించాల్సి ఉందని, ఆ సిరీస్‌కు తాము రావడం లేదని ప్రకటించింది. ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్‌కు భారత్ రాకపోతే తాము భారత్ వెళ్లబోమని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద అభిమానులతో కూడిన రెండు దేశాలు ఇలా ప్రకటించటంతో..ఐసీసీకి పెద్ద తలనొప్పిగా మారింది.

#teamindia #pakistan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe