ఇండియా మరోసారి అదే పొరపాటు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక ప్లేయర్ను ఆడించడం, పక్కన పెట్టడం, తర్వాత మళ్లీ టీమ్లోకి తీసుకోవడం, సరిగ్గా ఆడలేదంటూ పక్కన పెట్టడం బీసీసీఐ తరతరాలుగా చేస్తున్న పొరపాటు. మూడు మ్యాచ్లు ఆడించారో లేదో తెలుగు కుర్రాడు తిలక్వర్మ(Tilak Varma)కు రెస్ట్ ఇవ్వాలని జట్టు యాజమాన్యం ఫిక్స్ ఐనట్టు తెలుస్తోంది. ఇవాళ(డిసెంబర్ 1) జరగనున్న నాలుగో టీ20కి తిలక్ను పక్కన పెట్టి వరల్డ్కప్ ఫైనల్లో ఫ్లాప్ అయిన ప్లేయర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)ని ఆడించనుంది. తొలి మూడు టీ20లకు రెస్ట్లో ఉన్న ‘అయ్య’గారు నాలుగో టీ20కి వైస్ కెప్టెన్సీ హోదాలో విచ్చేశారు. దీంతో బీసీసీఐపై అభిమానులు మండిపడుతున్నారు. ఈ సిరీస్ మొత్తానికి అయ్యర్కు రెస్ట్ ఇస్తే పోయేదేముందని ప్రశ్నిస్తున్నారు.
పూర్తిగా చదవండి..IND VS AUS: తెలుగు కుర్రాడు ఔట్.. బరిలోకి వరల్డ్కప్ ఫైనల్ ఫ్లాప్ ప్లేయర్!
రాయ్పూర్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 1న జరగనున్న నాలుగో టీ20లో రెండు మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్, వరుసగా ఫెయిల్ అవుతున్న పేసర్ ప్రసిద్ కృష్ణ స్థానంలో దీపక్ చహర్ తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం.
Translate this News: