/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-14.jpg)
Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత జట్టుకు షాకింగ్ ఓటమి ఎదురైంది. హాఫ్ టైమ్ వరకు ఆధిక్యంలో ఉన్న భారత్, తర్వాత రెండు గోల్స్ తిని 2-1తో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో భారత జట్టు మొదటి హాఫ్లో అద్భుత ప్రదర్శన చేసింది. ప్రత్యర్థిని ఆధిక్యంలో ఉంచింది. అయితే, సెకండ్ హాఫ్ ప్రారంభం కాగానే బెల్జియం జట్టు తిరుగుబాటు చేసింది. వరుసగా రెండు గోల్స్ చేసి భారత్ను షాక్కు గురిచేసింది.
🇮🇳 𝗗𝗲𝗳𝗲𝗮𝘁 𝗳𝗼𝗿 𝗜𝗻𝗱𝗶𝗮! India faced defeat against Belgium in the men's hockey event despite leading at the half-time break. Belgium eventually managed to power through India's defense in the third and fourth quarters to claim the win.
⏰ India will next take on… pic.twitter.com/pzAIlVpKWT
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 1, 2024
Also Read : భారత్కు మూడో మెడల్.. షూటింగ్లో రఫ్పాడించిన స్వప్నిల్!
ఈ మ్యాచ్ లో భారత్ తరపున అభిషేక్ ఒక్కడే గోల్ చేశాడు. తొలి రెండు క్వార్టర్లలో భారత్ దూకుడు ప్రదర్శించినా.. కీలకమైన చివరి రెండు క్వార్టర్స్లో బెల్జియం ఆటగాళ్లు జోరు పెంచారు. రాజ్ కుమార్ పాల్కు ఎల్లో కార్డు ఇవ్వడం వల్ల.. చివరి నిమిషాల్లో ఒక ఆటగాడు లేకుండానే ఇండియా ఆడాల్సి వచ్చింది. ఈ ఓటమితో భారత హాకీ జట్టు అభిమానులు నిరాశ చెందారు. అయితే, ఇంకా టోర్నమెంట్ ముగియలేదు. భారత్ తిరిగి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది.