Ind vs Aus T20 Series: యువబౌలర్లు తిప్పేశారు.. చివరి మ్యాచ్ మనదే.. ఆసీస్ కు ఓటమి తప్పలేదు  

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో ఐదవ.. చివరి మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. దీంతో సిరీస్ ను 4-1తో ఘనంగా ముగించింది. ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్లను 160 పరుగులే చేసింది. అయినా బౌలర్లు రాణించడంతో కంగారూలను 154 పరుగులకే ఆలౌట్ చేసి విక్టరీ కొట్టింది టీమిండియా.

New Update
Ind vs Aus T20: కంగారూలతో చివరి టీ20.. మన కుర్రోళ్ళ జోరు కొనసాగుతుందా?

Ind vs Aus T20 Series: యువ ఆటగాళ్ల  ఉత్సాహంతో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ ను ఘనంగా ముగించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్ల బలంతో మరోసారి స్వల్ప స్కోరును కాపాడుకుని 6 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 4-1తో కైవసం చేసుకుంది.

చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదు అవుతాయని భావించారు. అయితే చిన్నస్వామి పిచ్ మాత్రం బ్యాట్స్ మెన్ కు అవకాశం ఇవ్వలేదు. చిన్న స్కోరుకే పరిమితమైన ఈ మ్యాచ్ చివరివరకూ ఉత్కంఠ భరితంగా సాగి అందరినీ ఆశ్చర్యపరిచింది. వరుసగా మూడో మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వరుసగా రెండో మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ బౌలర్ల శ్రమను వృథా చేశారు.

శ్రేయాస్-అక్షర్ సమయోచిత ఇన్నింగ్స్.. 

గత మ్యాచ్ మాదిరిగానే ఈసారి కూడా టీమ్ఇండియా పవర్ ప్లే లో  తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ (21) భారీ షాట్లతో ఆరంభించి మళ్లీ ఔటయ్యాడు. అయితే ఈసారి మిగతా బ్యాట్స్ మెన్ కూడా ఇన్నింగ్స్ ను హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యారు. రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) కూడా త్వరగానే ఔటయ్యారు. 10వ ఓవర్ సమయానికి రింకూ సింగ్ ఈ సిరీస్ లో తొలిసారిగా ఎలాంటి ప్రభావం  చూపించకుండా పెవిలియన్ చేరడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. కేవలం 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమ్ఇండియా కష్టాల్లో పడింది. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ (Shreyas iyer - 53) నిలకడగా రాణించాడు. జితేష్ శర్మ (24 పరుగులు, 16 బంతుల్లో)తో కలిసి 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (31 పరుగులు, 21 బంతుల్లో) మద్దతు లభించడంతో వీరిద్దరూ కలిసి 46 పరుగులు జోడించి జట్టును 143 పరుగులకు చేర్చారు. చివరి ఓవర్లో అయ్యర్ హాఫ్ సెంచరీ సాధించడంతో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.

Also Read: కంగారూలతో చివరి టీ20.. మన కుర్రోళ్ళ జోరు కొనసాగుతుందా?

భారత బౌలర్ల విజయం.. 

Ind vs Aus T20 Series: ఆస్ట్రేలియా బౌలర్లలో ట్రావిస్ హెడ్ (28) మరోసారి మంచి ఆరంభం ఇచ్చినా రెండో ఓపెనర్ జోష్ ఫిలిప్ మరోసారి చౌకబారుగా ఆడాడు. మూడో ఓవర్లో ముఖేష్ కుమార్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.  తర్వాతా హెడ్ దాడి కొనసాగింది.  బెన్ మెక్డెర్మో కూడా అతనితో చేరాడు.  పవర్ ప్లేలో బౌలింగ్ చేయడానికి వచ్చిన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్.. వచ్చిన వెంటనే వికెట్ అందించాడు. ఆ తర్వాతి ఓవర్లో ఈ యువ బౌలర్ ఆరోన్ హార్డీ వికెట్ కూడా కొట్టాడు. మెక్డెర్మోట్ అవతలి వైపు నుంచి పరుగులు చేస్తూ జట్టును మ్యాచ్లో నిలబెట్టాడు.

అయితే  టిమ్ డేవిడ్  మళ్లీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. బ్యాట్ తో సత్తా చాటిన అక్షర్ (1/16) ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో అద్భుతాలు చేసి డేవిడ్ ను ఔట్ చేశాడు. 15వ ఓవర్లో అర్ష్దీప్ సింగ్ మెక్డెర్మోట్ (54)ను ఔట్ చేయడం ద్వారా పరిస్థితిని భారత్ కు  అనుకూలంగా మలిచాడు. వేడ్ (22) మరోసారి విజయంవైపు ఆసీస్ ను తీసుకువెళ్లేలా కనిపించాడు.. కానీ అర్షి దీప్  సింగ్ (2/40) చివరి ఓవర్లో అతడిని ఔట్ చేసి ఆస్ట్రేలియాకు అవసరమైన 10 పరుగులు చేయనివ్వలేదు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు