PM Modi Swearing-in-Ceremony: ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం.. మాల్దీవుల అధ్యక్షుడికి ఆహ్వానం!

ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో శ్రీలంక, బంగ్లాదేశ్ నేతలతో పాటు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిసు కూడా కేంద్రం ఆహ్వానం పంపింది.

PM Modi Swearing-in-Ceremony: ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం.. మాల్దీవుల అధ్యక్షుడికి ఆహ్వానం!
New Update

Maldives President Mohammad Muizzu: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మెజారిటీ సాధించడంతో నరేంద్ర మోదీ ఈ  ఆదివారం (జూన్ 9) మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బంగ్లాదేశ్‌, శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, మారిషస్‌ దేశాధినేతలను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం పంపింది. అంతేకాకుండా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మోయిస్‌ను కూడా కేంద్రం ఆహ్వానించింది.

ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించినప్పుడు పలువురు మాల్దీవుల మంత్రులు ఆయన పర్యటనపై విమర్శలు గుప్పించారు. ఫలితంగా, మాల్దీవుల-భారతీయ సంబంధాలలో ముగ్గురు మాల్దీవుల మంత్రులు సస్పెండ్ అయ్యారు. అలాగే, మాల్దీవుల పర్యటనల కోసం కొన్ని బుకింగ్ కంపెనీలు కూడా తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

Also Read: ఏపీలో ముగ్గురు ఐఏఎస్ లపై బదిలీ వేటు!

తదనంతరం, మాల్దీవులకు ఎక్కువ మంది చైనా పర్యాటకులు రావాలని అధ్యక్షుడు మొహమ్మద్ మొయిసు విజ్ఞప్తి చేశారు. భారత్‌తో వివాదానికి ఆజ్యం పోసేలా ఆయన చేసిన వ్యాఖ్యలు స్వదేశంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి.ఈ సందర్భంలో మళ్లీ ప్రధాని మోదీ పదవీ బాధ్యతలు చేపట్టనున్న వేళ.. వేడుకలో పాల్గొనాల్సిందిగా మహమ్మద్ మోయిస్ కు ఆహ్వానం అందడం ఇరుదేశాల రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యానికి గురి చేసింది.

#oath #pm-modi #pm-narendra-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe