Mukkoti Ekadasi: ఇవాళ గుడికి వెళ్తున్నారా? అయితే శంఖు తీర్థం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా?

నేడు ముక్కోటి ఏకాదశి. విష్ణుభక్తులు ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయుడిని దర్శించుకుంటారు. అయితే శంకుతీర్థాన్ని తీసుకోవడం మర్చిపోవద్దు. క్షీరసాగర మథనాన్ని దేవతలు, రాక్షసులు చేపట్టారని..ఆ సమయంలో శ్రీ మహాలక్ష్మీతోపాటు దక్షిణావర్తి శంఖం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.

New Update
Mukkoti Ekadasi: ఇవాళ గుడికి వెళ్తున్నారా? అయితే శంఖు తీర్థం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా?

Are You Going To Temple : దక్షిణవర్తి శంఖం అంటే ఏంటి...ఈ శంఖానికి పురాణాల్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటి..హైందవ సంప్రాదయంలో ఒక్కో వస్తువుకు ఒక్క ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని వస్తువులు శుభాలను కలిగిస్తే..మరొకొన్ని అశుభ ఫలితాలను కలిగిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.పౌరాణిక గ్రంథాల ప్రకారం క్షీరసాగర మథనాన్ని దేవతలు, రాక్షసులు చేపట్టారు. ఆ సమయంలో శ్రీ మహాలక్ష్మీతోపాటు దక్షిణావర్తి శంఖం ఉద్భవించిందని పురాణాలు అంటున్నాయి. అందుకే దక్షిణావర్తి శంఖంకు హైందవ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. లక్ష్మీదేవితోపాటు ఈ శంఖాన్ని పూజించినట్లయితే కష్టాలు తీరి శుభ ఫలితాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.

దక్షిణవర్తి శంఖంను పూచించడం, ఇంట్లోని పూజ గదిలో దాన్ని ఉంచడం వల్ల శ్రీ మహాలక్ష్మీ(Sri Mahalakshmi) అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆహార ధాన్యాల కొరత ఉండందంటున్నారు. సాధారణంగా సముద్రంలో ఎడమ రెక్కలు ఉన్న శంఖాలే కనిపిస్తాయి. సాధారణ శంఖాలు ఉదరం ఎడమ వైపు తెరిచి ఉంటుంది. అదే దక్షిణ శంఖ ముఖం కుడివైపు తెరిచి ఉంటుంది. ఈ శంఖాన్ని చాలా పవిత్రమైందిగా ప్రయోజకరమైందిగా భావిస్తారు.

వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadasi) నాడు వైష్ణవ ఆలయాల్లో దక్షిణావర్తి శంఖంలో తీర్థాన్ని ప్రసాదంగా భక్తులకు అందిస్తారు. ఈ శంఖంలో తీర్థం తాగడం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని అక్చులు చెబుతున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి మేల్కొన్న మహావిష్ణువు, లక్ష్మీదేవి సమేతంగా అనుగ్రహం ఇస్తారని భక్తులు నమ్ముతుంటారు. అలాంటి శంఖంలో తీర్థం పుచ్చుకోవడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయని నమ్ముతుంటారు.

నిత్యం ఇంట్లో దక్షిణావర్తి శంఖాన్ని ఉంచడం వల్ల శుభప్రదంగా భావిస్తారట. ఇంట్లో ఉంచుకునేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. శుభ్రమైన ఎరుపు వస్త్రంలో ఈ శంఖంను ఉంచి...గంగాజలంతో నింపాలి. ‘ఓం శ్రీ లక్ష్మీ బేతాయై నమః’ అనే మంత్రాన్ని జపించి పూజ గదిలో పెట్టాలి. మంత్రం చదివిన తర్వాత దక్షిణవర్తి శంఖాన్ని ఎర్రటి గుడ్డలో కట్టి పెట్టాలి. దీనిని ప్రతిశుక్రవారం పూజిస్తే ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదని పండితులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: చంద్రయాన్-3, హమాస్ అంటే ఏంటి? తో పాటు.. ఈ ఏడాదిలో గూగుల్ లో టాప్ సెర్చ్ లు ఇవే!

Advertisment
తాజా కథనాలు