Srisailam: మల్లన్న భక్తులకు అలర్ట్...ఆ మూడు రోజులు ఆర్జిత అభిషేకాలకు బ్రేక్!
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు ఆర్జిత అభిషేక సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. శనివారం ముక్కోటి ఏకాదశితో పాటు ఆదివారం, సోమవారం కూడా సెలవులు కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.