Bigg Boss 7 Winner: బిగ్ బాస్ సీజన్ 7 ఉత్కంఠగా ముగిసింది. చివరి వారం వరకు శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ మధ్య జరిగిన టైటిల్ పోరులో రైతు బిడ్డ ప్రశాంత్ విజేతగా నిలిచాడు. కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ గా గెలిచి బిగ్ బాస్ చరిత్రలో రికార్డ్ క్రియేట్ చేశాడు. సీజన్ మొదట్లో.. రెండు వారాలకే వెళ్ళిపోతాడని ఊహించారు. కానీ ఆ తర్వాత తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆట పై తనకున్న పట్టుదల, ఆసక్తి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆదివారం ముగిసిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో విజేతను ప్రకటించిన సంగతి తెలిసిందే. విజేతను ప్రకటించిన తర్వాత స్టేజ్ పై ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Winner: నేను గెలిచిన 35 లక్షలు మొత్తం వాళ్ళకే .. పల్లవి ప్రశాంత్ షాకింగ్ కామెంట్స్..!
పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు. విజేతను ప్రకటించిన అనంతరం స్టేజ్ పై ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. తాను గెలుచుకున్న విన్నర్ అమౌంట్ 35 లక్షలు మొత్తం కష్టాల్లో ఉన్న రైతులకు ఇస్తానని తెలిపాడు.
Translate this News: