/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-04T160350.343.jpg)
రాజస్థాన్ రాష్ట్ర వ్యవసాయం, ఉద్యానవనం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిరోడి లాల్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఏడు లోక్సభ నియోజకవర్గాల్లో ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కిరోడి లాల్ మీనా ప్రకటించారు.
ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఏడు లోక్సభ నియోజకవర్గాల్లో ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కిరోడి లాల్ మీనా ప్రకటించారు. ఆయన సొంత నియోజకవర్గం దౌసా సహా నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోయింది. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆయన మంత్రి కార్యాలయానికి గైర్హాజరయ్యారు.
పరాజయానికి బాధ్యత వహిస్తూ కిరోడి లాల్ మీనా ఈరోజు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఇంకా ఆమోదించలేదని సమాచారం.