Hydra: హైడ్రా అంటే హడల్.. ఆక్రమణదారులకు వణుకు పుట్టాల్సిందే!

హైదరాబాద్ లో భూఆక్రమణదారులను హైడ్రా హడలెత్తిస్తోంది. ఎక్కడ అక్రమ నిర్మాణం కనపడినా.. నిమిషాల్లో నేలమట్టం చేసేస్తోంది. ఐజీ రంగనాధ్ ను హైడ్రాకు సారధిగా నియమించింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో అసలు హైడ్రా ఏంటి?, దాని విధులు ఏంటి? అన్న వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.

HYDRA: అప్పటివరకు కూల్చివేతలకు బ్రేక్.. కారణమిదే!
New Update

Hydra: హైదరాబాద్ లో భూ ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. నిత్యం అక్కడ ఈ దందాలపై ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. ఈ దందాల వెనుక రియల్ ఎస్టేట్ కంపెనీలు.. రాజకీయ నేతలు ఉంటారనే ఆరోపణలు ఎప్పుడూ వినిపిస్తాయి. అయితే, ప్రస్తుతం ఇలాంటి దందాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడ అక్రమ నిర్మాణం కనపడినా చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయిపోయింది. ఇందుకోసం వ్యవస్థను పటిష్టం చేసింది. ఇందుకోసం హైడ్రా అంటే హైదరాబాద్‌‌‌‌ డిజాస్టర్‌‌‌‌ రెస్పాన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ అసెట్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. దీనికి సారధిగా ఐజీ రంగనాధ్ ను నియమించింది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడు హైడ్రాకు పెద్ద ఎత్తున అధికారులను కేటాయిస్తూ ఆదేశాలిచ్చారు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్. మొత్తం 259మంది ఆఫీసర్లు.. సిబ్బందిని కేటాయించారు. ఒక ఐపీఎస్, ముగ్గురు గ్రూప్1 స్థాయి ఎస్పీయేలు, 5గురు డిప్యూటీ సూపరింటెండెంట్స్, 21మంది ఇన్సపెక్టర్స్, 33 మంది ఎస్సైలు, 12గురు రిజర్వ్ ఎస్సైలు, 101 మంది కానిస్టేబుల్స్, 72 మంది హోమ్ గార్డ్స్, అనలిటిక్ ఆఫీసర్లు, అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్లను హైడ్రాకు ఇచ్చారు. 

Hydra: ఇప్పటికే హైడ్రా తనపని ప్రారంభించింది. పలు అక్రమ కట్టడాలను కూల్చేసింది. ఇందులో పార్టీ మారుతారని ప్రచారంలో ఉన్న నాయకులు, పార్టీ మారి అధికార పార్టీ పంచన చేరిన నేతలకు చెందిన కట్టడాలు కూడా ఉన్నాయి. అనుమతి లేనివి.. కబ్జా చేసిన స్థలం లేదా చెరువులను ఆక్రమించిన కట్టడం ఏదైనా సరే దానిని నేరుగా కూలగొట్టడమే హైడ్రా చేస్తున్నపని. దీంతో ఇప్పుడు ఆక్రమణల దందాలో పాతుకఁజూపోయినవారు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 

హైడ్రాకు ఎందుకు భయపడుతున్నారు..

Hydra: దీనికి కారణం ముఖ్యంగా ఒకటి ఉంది. అది దీని చీఫ్ గా నియమితులైన ఏవీరంగనాధ్. ఈయన పవర్ ఫుల్ ఐపీఎస్ గా పేరుతెచ్చుకున్నారు. గతంలో మార్కాపురం, కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సల్స్ ను అణిచివేయడంలో కర్కశంగా వ్యవహరించారన్న పేరు ఈయనకు ఉంది. రంగనాధ్ ఆధ్వర్యంలో హైడ్రా ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరుతుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. అదేసమయంలో రంగనాధ్ పవర్ తెలిసిన అక్రమార్కులు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. మొత్తం 3500 మంది సిబ్బందితో హైడ్రాను పటిష్టం చేయాలని ఐజీ రంగనాధ్ కోరినట్టు చెబుతున్నారు. అలా పూర్తిస్థాయిలో సిబ్బంది అందుబాటులోకి వస్తే.. కబ్జాలు అన్నీ భూ మట్టం అయిపోవడం ఖాయమని అందరూ చెప్పుకుంటున్నారు.

Also Read : హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో మూడు రోజులు వానలే !

#hydra #ig-ranganath
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe