TG: పల్లా కాలేజీ దగ్గర ఉద్రిక్తత.. భూములు ఆక్రమించారని ఆందోళన!

మేడ్చల్‌ జిల్లా వెంకటాపూర్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాలేజీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నీలిమ మెడికల్‌ కాలేజీని కూల్చేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. తమ భూముల్ని కబ్జా చేసి పల్లా కాలేజీ నిర్మించారని బాధితులు నిరసనకు దిగారు.

New Update
TG: పల్లా కాలేజీ దగ్గర ఉద్రిక్తత.. భూములు ఆక్రమించారని ఆందోళన!

Palla Rajeshwar Reddy : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన నాగార్జునకు చెందిన N- కన్వెన్షన్‌ను సైతం హైడ్రా నేలమట్టం చేసింది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాలేజీల నిర్మాణంలోనూ అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Also Read: కావాలంటే కాల్చేయండి.. నరికి చంపండి: ఓవైసీ బ్రదర్స్ సంచలన కామెంట్స్

ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాలేజీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నీలిమ మెడికల్‌ కాలేజీని కూల్చేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. తమ భూముల్ని కబ్జా చేసి.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాలేజీ నిర్మించారని బాధితులు నిరసనకు దిగారు. మేడ్చల్‌ జిల్లా ఘట్ కేసర్‌ మండలం వెంకటాపూర్‌లో నీలిమ మెడికల్‌ కాలేజీ, గాయత్రి ఎడ్యుకేషనల్‌ ట్రస్టు తమ భూమిని సైతం కబ్జా చేసి కట్టించినవేనని బాధితులు ఆరోపిస్తున్నారు.


Also Read: కడపలో చెత్త రాజకీయం.. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి వర్సెస్ మేయర్ సురేష్ బాబు..!

వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే 796లోని 11 ఎకారాల 20 గుంటలు.. అందులో ఏడెకరాలు 20 గుంటల్ని గాయత్రి ఎడ్యుకేషనల్‌ సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన నాలుగెకరాల తమ భూమిని రాజేశ్వర్‌ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని ఆందోళన చేపట్టారు. వారిని పల్లా అనుచరులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది.

Advertisment
తాజా కథనాలు