TS Police : కేవలం ఆరే గంటలు.. కిడ్నాపర్లను వేటాడి పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు!

హైదరాబాద్ పాతబస్తీలో 18నెలల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. బహుదూర్ పురా పీఎస్ పరిధిలోని కిషన్ బాగ్ లో సోమవారం ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్ కు గురైంది. సీసీ ఫుటీ ఆధారంగా 24గంటల్లో ఆ చిన్నారిని పోలీసులు కనుగొన్నారు.

TS Police : కేవలం ఆరే గంటలు.. కిడ్నాపర్లను వేటాడి పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు!
New Update

హైదరాబాద్ పాతబస్తీలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బహుదూర్ పురా పీఎస్ పరిధిలోని కిషన్ బాగ్ లో సోమవారం ఏడాదిన్నర వయస్సున్న చిన్నారిని కిడ్నాప్ చేశారు. ఓ మహిళ పాపను అపహరించి తీసుకెళ్తున్న ద్రుశ్యాలు అన్నీ కూడా సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఆధారంగా 24గంటల వ్యవధిలోనే ఆ చిన్నారి ఆచూకీని బహుదూర్ పురా పోలీసులు కనుగొన్నారు.

ఫిర్యాదు ఇచ్చిన 4 గంటల్లోనే కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. కిడ్నాప్ చేసిన మహిళను అరెస్టు చేసి...ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. తన కొడుకుకు 8ఏళ్లుగా పిల్లలు పుట్టకపోవడంతోనే మహిళ..పాపను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

 తెలంగాణలో ఈ ఏడాది కరోనా తొలి మరణం..

తెలంగాణలో తొలి కరోనా మరణం కేసు నమోదైంది. హైదరాబాద్ లోని ఉస్మానియా హస్పిటల్ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఓ వ్యక్తి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. చలి జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తుండగానే కన్నుమూశాడని వైద్యులు తెలిపారు. ఇక దీనికి సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు పెరగగా పలు చోట్ల మరణాల రేటు కూడా నమోదైంది. ఇప్పటి వరకూ దేశంలో 412 యాక్టివ్ కేసులు నమోదు అవగా 4,170 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ముఖ్యంగా కేరళలో అత్యధికంగా కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతుండటంతో వైద్యాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కి జ్వరం, దగ్గు, జలుబుతో వచ్చిన ప్రతి ఒక్కిరికీ పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకూ తెలంగాణలో 455 మందికి కరోనా పాజిటీవ్ సోకిందని, హైదరాబాద్ లోనే అత్యధికంగా 55 కేసులు నమోదైనట్లు వైద్యులు వెల్లడించారు.

ఈ క్రమంలోనే తీవ్ర జ్వరంతో  ఒక వ్యక్తి ఉస్మానియా ఆస్పత్రికి రాగా టెస్టులు నిర్వహించి అతనికి కోవిడ్ సోకినట్లు నిర్దారించి చికిత్స అందిస్తుండగానే మంగళవారం ఉదయం చనిపోయాడని తెలిపారు. దీంతో తెలంగాణలో తొలి కరోనా మరణం కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. అయితే ఇది కొత్త రకం జేఎన్-1 అనేదానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ సదరు వ్యక్తి ఊపిరి తిత్తుల సమస్యతో నిపోయినట్లు డాక్టర్స్ చెప్పారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో కోవిడ్ టెస్టులకు సంబంధించి టెస్ట్ సెంటర్ లను పెంచినట్లు అధికారులు తెలిపారు.  అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు జేఎన్‌.1 వేరియంట్‌ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ సంచాలకులు రవీంద్ర నాయక్‌ తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడవద్దని అప్రమత్తంగా ఉండాలని రవీంద్ర నాయక్‌ సూచించారు జాగ్రత్తలు పాటిస్తేనే కరోనాను మన దరి చేరనీయకుండా తరిమి కొట్టవచ్చని అన్నారు.

ఇది కూడా చదవండి: హిందువులపై కుట్ర జరుగుతోంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

#hyderabad #baby-kidanap #kidnap-case #ts-police
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి